మహబూబాబాద్ రూరల్, ఆగస్టు 19 : స్వతంత్ర భా రత వజ్రోత్సవాలు జిల్లాలో కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రోజుకో కార్యక్రమం నిర్వహిస్తుండగా, ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. శు క్రవారం జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు, అ నాథాశ్రమాల్లో చిన్నారులు, వృద్ధులకు స్వీట్లు, పండ్లు, బ్రె డ్లు, పంపిణీ చేశారు. విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు అందజేశారు. అనంతరం క్రీడలు, ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రైవేట్ దవాఖానల్లో కంటే మెరుగైన వైద్యం అందుతున్నదని సర్పంచ్ సందా వీరన్న అన్నారు. శుక్రవారం వజ్రోత్సవాలను పురస్కరించుకొని కంబాలపల్లి పీహెచ్సీలో రోగులు, గర్భిణులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రభుత్వ వైద్యశాలల్లో సకల సౌకర్యాలు కల్పించి, ప్రతి పల్లెలో సబ్ సెంటర్లను ఏర్పాటు చేసి కార్పొరేట్ వైద్యం అందించేలా చర్యలు చేపట్టారన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ వేణు, మెడికల్ ఆఫీసర్ సుధీర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
తొర్రూరు: పీహెచ్సీలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీడీఎంహెచ్వో జీ మురళీధర్, మున్సిపల్ చైర్మన్ ఎం రామచంద్రయ్య, కమిషనర్ జీ బాబు, వైస్చైర్మన్ జీ సురేందర్రెడ్డి, పీ సోమేశ్వర్రావు, డీ జైసింగ్, జీ నర్సయ్య, జీ సాయికృష్ణ, వైద్యులు మీరాజ్, సిబ్బంది పాల్గొన్నారు.
కేసముద్రం: మండల పరిధి కేసముద్రం, ఇనుగుర్తి పీహెచ్సీల్లోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఎంపీపీ ఓలం చంద్రమోహన్, సర్పంచులు దార్ల రామ్మూర్తి,ఎన్నమల ప్రభాకర్, ఎస్సై తిరుపతి, ఐసీడీఎస్ సూపర్వైజర్ దుర్గా, వైద్యులు పవన్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు పీ శ్రీనివాస్, బీ చంద్రయ్య, మంగ్యానాయక్, జీ వీరునాయక్, వీ రవినాయక్, దేవేందర్ పాల్గొన్నారు.
డోర్నకల్: మండలంలోని పీహెచ్సీలో గర్భిణులు, విద్యార్థులు, వృద్ధులకు డిప్యూటీ డీఎంహెచ్వో ఉమాగౌరి, మున్సిపల్ కమిషనర్ కే శ్రీనివాసరావు, వార్డు కౌన్సిలర్లు కందుల అరుణ, పోటు జనార్దన్, కాలా సురేందర్ జైన్, బసిక అశోక్ పండ్లు, స్వీట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. వజ్రోత్సవాలతో భారతదేశ కీర్తి ప్రపంచానికి చాటాలన్నారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారులు కనకదుర్గ, స్నేహలత, టీఆర్ఎస్ నాయకులు కొత్త వీరన్న, కందుల మధు, మున్సిపల్ హెల్త్ అసిస్టెంట్ అహ్మద్, సీహెచ్వో వీరబాబు, హెచ్ఈ శారద, మున్సిపల్ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
చిన్నగూడూరు,(మరిపెడ): స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాడిన మహనీయుల జీవితాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీపీ అరుణారాంబాబు అన్నారు. శుక్రవారం మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పీహెచ్సీల్లో మెరుగైన ఉచిత వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నద ని తెలిపారు.అనంతరం మున్సిపల్ కేంద్రంలోని మోడల్ స్కూల్లో విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. జడ్పీటీసీ శారదారవీందర్ ముఖ్య అతిథిగా పాల్గొని ముగ్గులను పరిశీలించారు. వైద్యాధికారి రవికుమార్, ప్రిన్స్పాల్ ప్రేమ్కుమార్, స్కూల్ చైర్మన్ జీ విష్ణు, సీనియర్ అసిస్టెంట్ శేషాశయనం, వైద్య సిబ్బంది ఉన్నారు.
దంతాలపల్లి: మండల పరిధి పెద్దముప్పారం గ్రామంలోని అమ్మఒడి అనాథ ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు అందజేశారు. తొర్రూరు డీఎస్పీ రఘు, సీఐ సత్యనారాయణ, ఐసీడీఎస్ సీడీపీవో శిరీష, ఎంపీడీవో గోవిందరావు, ఆధ్వర్యంలో దుప్పట్లు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. జడ్పీఎస్ఎస్లో విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఎంపీవో అఫ్సర్పాషా, ఎస్సై జగదీశ్, సూపర్వైజర్ సుధ, ఎంపీటీసీ పద్మ పాల్గొన్నారు.
పెద్దవంగర : మండలంలోని అన్ని జీపీల్లో ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు ఏపీఎం నరేంద్రకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఐకేపీ సీసీలు, వీవోఏల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. మహిళలు, యువతులు పోటీల్లో పాల్గొనాలని సూచించారు.
నెల్లికుదురు: మండల కేంద్రంలోని పీహెచ్సీలో రోగులకు ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి పండ్లు పంపిణీ చేశారు. అనంరతం ఆమె మాట్లాడుతూ..ఎంతోమంది త్యాగఫలమే నేడు మనం అనుభవిస్తున్న స్వతంత్రమని అన్నారు. ప్రతి ఒక్కరూ జాతీయ సమైక్యత కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బీరవెళ్లి యాదగిరిరెడ్డి, తహసీల్దార్ యోగేశ్వరరావు, ఎంపీడీవో శేషాద్రి, వైద్యాధికారి అన్వేశ్ కుమార్, సిబ్బంది వెంకటేశ్వర్లు, రవి, విజయ, పద్మావతి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.