బయ్యారం, ఆగస్టు 19 : అహర్నిశలు దేశ రక్షణ కోసం పాటుపడుతున్న జవాన్ల సేవలు వెలకట్టలేనివని కలెక్టర్ కే శశాంక, ఎస్పీ శరత్చంద్ర పవార్, జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు అన్నారు. శుక్రవారం మండల కేం ద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయం లో వజ్రోత్సవాల్లో భాగంగా సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలను సొసైటీ అధ్యక్షుడు మూల మధుకర్రెడ్డి ఆధ్వర్యంలో సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశసేవ చేయడం గొప్ప వరమని, ఇలాంటి అవకాశం అందరికి రాదన్నారు. జవాన్లు కుటుంబసభ్యులకు దూరంగా ఉంటూ ఎం డ, వాన, చలిని లెక్క చేయకుడా తమ ప్రాణాలను సైతం ఫణం గా పెట్టి దేశసేవ చేస్తున్నారని పేర్కొన్నారు.నిత్యం 15 లక్షల మంది సైనికులు కంటికి రెప్పలా దేశాన్ని కాపడుతుంటారని, వారి త్యాగలవల్లే నేడు మనం ప్రశాంత జీవనం గడుపుతున్నామని పేర్కొన్నారు.
సైనికుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని, ముఖ్యంగా యువత ఆర్మీ ఉద్యోగంలో చేరేందుకు ఆసక్తి చూపాలన్నారు. బయ్యారం మండలంలో ఎక్కువ మంది సైనికులుగా దేశ సేవలో పాల్గొనడం జిల్లాకే గర్వకారణమన్నారు. వారిని గుర్తించి సన్మానించినందుకు మధుకర్రెడ్డిని అభినందించారు.
బయ్యారం, వెంకట్రాంపురం, సింగారం, కస్తూరి నగర్, సింగారం, కొత్తపేటకు చెందిన 54 మంది సైనికులు, మాజీ సైనికుల కుటుంబ సభ్యులను కలెక్టర్, ఎస్పీ, జడ్పీ చైర్ పర్సన్ సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. తమ కొడుకులు సైనికులుగా పని చేస్తుండడంతో గర్వంగా ఉందన్నారు. తమను గుర్తించి సన్మానించడం హర్షణీయమని మరికొందరు పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్, ఎస్పీని జడ్పీ చైర్పర్సన్ బిందు సన్మానించారు.
కార్యక్రమంలో తహసీల్దార్ రమేశ్, డీఎస్పీ సదయ్య, సీఐ బాలజీ, ఎస్సై రమాదేవి, ఎంపీటీసీ కుమారి, సర్పంచులు రమణమ్మ, పద్మ, జగన్, వెంకటేశ్వర్లు, అనసూర్య, స్వరూప, సొసైటీ డైరెక్టర్ శ్రీనివాస్, భాస్కర్, యశోద, కలింగరెడ్డి, భిక్షం, ఉప సర్పంచ్ కవిత, మాజీ జవాన్ల కల్నల్ వెంకటేశ్వరరావు, జీవన్రెడ్డి, రాఘవరెడ్డి, కొమురయ్య, నాయకులు శ్రీకాంత్, వెంకటపతి, కిరణ్, శ్రీను పాల్గొన్నారు.