కరీమాబాద్/గిర్మాజీపేట, ఆగస్టు 19: శ్రీకృష్ణాష్టమి వేడుకలను శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కరీమాబాద్లోని న్యూకౌటిల్యాస్(ఎస్ఏ) పాఠశాలలో బాలబాలికలు శ్రీకృష్ణడు, గోపికల వేషధారణలో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. మన ఆచారాలు, సంస్కృతీ సంప్రదాయాలను పిల్లలకు తెలియజేసేందుకే ఈ కార్యక్రమం నిర్వహించామని ప్రిన్సిపాల్ కోడం శ్రీధర్ తెలిపారు. కరస్పాండెంట్ కోడం సబిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే, ఎస్ఆర్ఆర్తోటలోని కివీ పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ దాసి సతీష్మూర్తి తెలిపారు. పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వరంగల్ 33వ డివిజన్లోని శాంతినగర్ అంగన్వాడీకేంద్రంలో చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణలో అలరించారు. అంగన్వాడీ టీచర్ శారద చిన్నారులకు ఆటపాటల పోటీలు నిర్వహించారు.
నర్సంపేట/వర్ధన్నపేట/నెక్కొండ/దుగ్గొండి/రాయపర్తి/సంగెం/పర్వతగిరి/గీసుగొండ/కాశీబుగ్గ/చెన్నారావుపేట: నర్సంపేటలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు వేషధారణలో నృత్యాలు చేసి, పాటలు పాడి అలరించారు. కార్యక్రమంలో బ్రహ్మకుమారి కల్పన, డాక్టర్ శ్రీనివాస్గౌడ్, వాణి, వీరలింగం, కిశోర్, బాబురావు, రామనాథం, జగన్మోహన్, శంకర్లింగం పాల్గొన్నారు. సంజయ్గాంధీనగర్ పాఠశాలలో ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. హెచ్ఎం బీ మహేందర్, ఉపాధ్యాయులు తాటిపర్తి అనిత, అంగన్వాడీ టీచర్ ఉమాదేవి పాల్గొన్నారు.
గీతాంజలి డీజీ హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో చైర్మన్ వేములపల్లి సుబ్బారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కేఎస్ఆర్ కాన్సెప్ట్ స్కూల్లో ప్రిన్సిపాల్ జ్యోతి ఆద్వర్యంలో పిల్లలు సందడి చేశారు. బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. వర్ధన్నపేట పట్టణంతోపాటు గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చిన్నారులను శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అలంకరించారు. వర్ధన్నపేటలోని బొడ్రాయి వద్ద యాదవ సంఘం ఆధ్వర్యంలో ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించగా యువకులు పోటీ పడ్డారు.
నెక్కొండలో గౌతమి విద్యానికేతన్లో చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో ఆడిపాడి అలరించారు. కరస్పాండెంట్ అనంతులు మురళీధర్, ప్రిన్సిపాల్ కల్పన పాల్గొన్నారు. దుగ్గొండిలోని ఆదర్శవాణి పాఠశాల, గిర్నిబావిలోని ఎంజేపీటీ, న్యూవిజన్ టెక్నో స్కూల్, భద్రుకా, మాతృశ్రీ డిగ్రీ కాలేజీలో వేడుకలు నిర్వహించారు. అదేవిధంగా గ్రామాల్లోని కూడళ్లలో ఉట్టికొట్టే కార్యక్రమంలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రత్యేకాధికారి, కరస్పాండెంట్లు కూరోజు దేవేందర్, రవి, ప్రిన్సిపాళ్లు, హెచ్ఎంలు, టీచర్లు నర్సింహారెడ్డి, మహిపాల్రెడ్డి, పిండి యుగేంధర్, అనిల్రెడ్డి, యాకూబ్, తిరుపతినాయక్, నాయుడు కోటేశ్వర్, ఇసాక్, రవికుమార్ పాల్గొన్నారు.
రాయపర్తిలోని లహరి పబ్లిక్ స్కూల్లో కరస్పాండెంట్ తంగెళ్ల రవిచంద్ర, హెచ్ఎం టీ ఉమారాణి నేతృత్వంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలు కృష్ణుడు, గోపికల వేషధారణలో సందడి చేశారు. ఉపాధ్యాయులు రాజు, సబిత, అనురాధ, స్వర్ణలత, స్వాతి, తేజశ్రీ, భాగ్యలక్ష్మి, తులసీ, మౌనిక, జ్యోతి పాల్గొన్నారు. సంగెం మండలం ముమ్మిడివరం(మొండ్రాయి)లోని సిద్ధార్థ పాఠశాలలో విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో ఆకట్టుకున్నారు. హెచ్ఎం టీ సుధాకర్, టీచర్లు నాగమణి, వందన, కవిత, లాస్య, శాంతకుమారి, శైలజ, యామిని, ప్రవళిక, వీరస్వామి పాల్గొన్నారు. పర్వతగిరిలోని విజ్డమ్ స్కూల్లో, చింతనెక్కొండలో పిల్లలు కృష్ణుడు, గోపికల వేషధారణలో అలరించారు.
నర్సంపేట మండలం లక్నేపల్లి శివారు బాలాజీ టెక్నో స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. భాంజీపేట ఎంపీపీఎస్, మహేశ్వరం శివారు శివాణి పబ్లిక్ స్కూల్లో పిల్లల వేషధారణ విశేషంగా ఆకట్టుకుంది. గీసుగొండ మండలం ఎలుకుర్తి సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు.
వరంగల్ కొత్తవాడ తుమ్మలకుంటలోని సన్ప్లవర్ హైస్కూల్లో విద్యార్థిని విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో ఆకట్టుకున్నారు. హెచ్ఎం సయ్యద్ సమీర్, సయ్యద్ నిసార్ పాల్గొన్నారు. చెన్నారావుపేటలో సర్పంచ్ కుండె మల్లయ్య ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. జడ్పీ కోఆప్షన్ సభ్యుడు రఫీ, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి పాల్గొన్నారు.