ఏటూరునాగారం, ఆగస్టు 9 : ఆదివాసీలకు రాజ్యాంగ పరంగా కల్పించిన హక్కులను కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తానని ఐటీడీఏ పీవో అంకిత్ అన్నారు. ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో మంగళవారం ఆదివాసీ అంతర్జాతీయ దినోత్సవ వేడుకలను ఆదివాసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పెసా జిల్లా కో ఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ అధ్యక్షత వహించారు. అధికారు లు, వివిధ సంఘాల నాయకులు భీం విగ్రహానికి పూల మాలలు వేసి నినదించారు. తుడుందెబ్బ సంఘం జెండాను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్ ఆవిష్కరించారు.
ఈ వేడుకల్లో పాల్గొన్న పీవో మాట్లాడారు. విద్య, వైద్య రంగాల్లో ఆదివాసీల సంక్షేమం కోసం ఐటీడీఏ పనిచేస్తుందన్నా రు. ఎలాంటి విపత్తులు సంభవించిన వెంట నే స్పందిస్తున్నట్లు తెలిపారు. ఇటీవలె వచ్చి న గోదావరి వరద బాధితులు 4వేల మం దికి ఐటీడీఏ ద్వారా సహాయం అందించినట్లు తెలిపారు. ఐటీడీఏ ఆవరణలో భీం విగ్రహం చిన్నగా ఉందని, త్వరలోనే పెద్దది ఏర్పాటు చేస్తామని పీవో ప్రకటించారు.
ఆదివాసీల సంక్షేమం కోసం అధికారులు, సం ఘాలతో సమన్వయ సమావేశం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఐటీడీఏలో వరద సహాయక చర్యల్లో భాగంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాణ్యమైన విద్యను గిరిజనులకు అందించే దిశగా పనిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ఉట్నూ రు, భద్రాచలం, ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలో వేర్వేరు జాతులతో ఆదివాసీలు ఉ న్నారని, వీరి సంక్షేమం కోసం ఐటీడీఏలు పనిచేస్తున్నట్లు తెలిపారు.
ఆదివాసీ సంఘా ల నాయకులు మాట్లాడుతూ అటవీశాఖ అధికారుల దాడులు గ్రామాల్లో నిలిపివేయాలని కోరారు. ఐటీడీఏ పరిధిలో వృత్తి, నైపుణ్యత శిక్షణ కేంద్రాలు, కళాశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వసంతరావు, ఏవో దామోదర్స్వా మి, ఎస్వో రాజ్కుమార్, ఈఈ హేమలత, మేనేజర్ శ్రీనువాస్, ఏసీఎంవో రవీందర్, పీహెచ్వో రమణ, భారతి, పీఏవో లక్ష్మీ ప్రస న్న, ఆదివాసీ సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఈసం రామ్మూర్తి, ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పొదెం కృష్ణ ప్రసాద్, తుడుందెబ్బ, ఆదివా సీ విద్యార్థి సంఘం, ఉద్యోగుల సంఘాల నాయకులు రత్నం, ధర్మయ్య, బాబురావు, రవి, సంతోశ్కుమార్, కోటయ్య, రవి, రా జు, మహేశ్, నర్స య్య, చంద్రకళ, వెంకటేశ్వర్లు, రవీందర్, విష్ణు, నర్సింగారావు, శోభ న్, నరేశ్, సారయ్య,రాంగోపాల్, వెంకటేశ్వర్లు, రాజబా బు, ఆదివాసీ ఉద్యోగుల సం ఘం నాయకులు పాల్గొన్నారు.