మరిపెడ, ఆగస్టు 9: తొర్రూరు, మరిపెడ, పెద్ద వంగర పోలీస్ స్టేషన్ల పరిధిలో నల్లబెల్లం, పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం మరిపెడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ శరత్చంద్ర పవార్ నిందితుల వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తాళ్లఊ కల్ గ్రామానికి తరలిస్తున్న నల్లబెల్లం లారీని పోలీసు లు పట్టుకున్నారు.
నిందితులు గుగులోత్ వీరన్న, చల్లా ఉపేందర్, తమ్మి శెట్టి రామరాజు, చల్లా నాగరాజుపై కేసు నమోదు చేశారు. రూ.13. 87 లక్షల విలువైన 12.5 టన్నుల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 5 క్వింటాల పటిక, 30 లీటర్ల గుడుంబా ను పట్టుకున్నారు. తొర్రూరు పోలీస్స్టేషన్ పరిధిలో ఆటోలో 10.8 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకుని, అక్రమంగా రవాణా చేస్తున్న పొనుగోటి మనోహర్పై కేసు నమోదు చేశారు. పెద్దవంగర మండలంలోని చిట్యాల గ్రామంలో 30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు.
నిందితులు మాలోత్ గనియా, జాటో త్ బిచ్యా, ఎండీ వలీపాషాపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శరత్చంద్ర పవార్ మా ట్లాడుతూ జిల్లాలో నిషేధిత వ్యాపారాలకు తావులేద న్నారు. అక్రమార్కులపై పీడీ యాక్టు నమోదు చేస్తామ ని హెచ్చరించారు. అనంతరం విధి నిర్వహణలో అం కితభావంతో పనిచేసిన తొర్రూరు డీఎస్పీ, మరిపెడ, తొర్రూరు సీఐ నునావత్ సాగర్, సత్యనారాయణ, టాస్క్ ఫోర్స్ సీఐ శ్రీనివాస్, ఎస్సైలు పవన్, రామారావు, సం తోష్, సతీశ్, రియాజ్పాషా తదితరులను ఎస్పీ అభినందించారు.