కొడకండ్ల, 9: పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో మన సంస్కృతీ సంప్రదాయాలకు టీఆర్ఎస్ సర్కారు గుర్తింపు ఇవ్వడంతోపాటు పండుగల సందర్భంగా అన్నివర్గాల ప్రజలకు చేయూతనిస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
మంగళవారం మండల కేంద్రంలోని కాలభైరవస్వామి, ముత్యాలమ్మ దేవాలయంలో బోనాల పండుగ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎర్రబెల్లి మహిళలతోపాటు బోనం ఎత్తుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. మరోవైపు మొహర్రం వేడుకల్లో పాల్గొని పీరీలను ఎత్తుకుని ప్రార్థనలు చేశారు. అనంతరం కూరగాయల మార్కెట్ అవరణలో రూ.5లక్షలతో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ సెంట్రల్ లైటింగ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ అమ్మవారితోపాటు అల్లా దయవల్ల సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర సుభిక్షంగా ఉందన్నారు.
వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండుతున్నాయని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్రెడ్డి, ఈజీఎస్ రాష్ట్ర సభ్యుడు అందె యాకయ్య, ఎంపీపీ ధరావత్ జ్యోతినాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సిందె రామోజీ, జడ్పీటీసీ కేలోత్ సత్తమ్మ, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పసునూరి మధుసూదన్, జీసీసీ మాజీ చైర్మన్ అభిమాన్ గాంధీనాయక్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు దీకొండ వెంకటేశ్వర్రావు, ఎంపీటీసీ కుందూరు విజయలక్ష్మి, అమరేందర్రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు ఎండీ నజీర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మసురం వెంకటనారాయణ, మండల ఉపాధ్యక్షుడు అసీఫ్, చెంచు రాజిరెడ్డి, దేశగాని సతీశ్, ఉపసర్పంచ్ రమేశ్, శోభన్ పాల్గొన్నారు.