జనగామ చౌరస్తా, జూలై 1 : ఆపదలో ఉన్న రోగులకు ప్రాణం పోసే దైవాలు వైద్యులని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అన్నారు. ‘డాక్టర్స్ డే’ సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో టీఎన్జీవోలు, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యాధికారులను ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా హాజరైన శివలింగయ్య మాట్లాడుతూ డాక్టర్ వృత్తి పవిత్రమైందని పేర్కొన్నారు.
24 గంటలు ప్రజా సేవ చేయడంలో ప్రభుత్వ వైద్యులు ముందు వరుసలో ఉం టారని ఆయన తెలిపారు. కరోనా సమయంలోనూ వై ద్యులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రోగులకు సేవలందించారని గుర్తు చేశారు. అనంతరం డీఎంహెచ్వో డాక్టర్ మహేందర్తో పాటు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సుగుణాకర్రాజును కలెక్టర్ శివలింగయ్య ఘనంగా సన్మానించారు.
కరోనా సమయంలోనూ వైద్యులు ధైర్యం గా రోగులకు సేవలందించారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మహేంద ర్ అన్నారు. ప్రధాన వైద్యశాలలతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ డాక్టర్లు, సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. అనంతరం పలు వురు వైద్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఏ భాస్కర్రావు, అబ్దుల్ హమీద్, జడ్పీ సీఈవో ఎల్ విజయలక్ష్మి, డీఆర్డీఏ పీడీ గూడూరు రాంరెడ్డి, డీపీవో రంగాచారి, ఆర్డీవో సీహెచ్ మధుమోహన్, జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కు మార్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఖాజా షరీఫ్, పెండెల శ్రీనివాస్ పాల్గొన్నారు.