హనుమకొండ సిటీ, జూలై 1 : బాలసముద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రభుత్వ ఛీప్ విప్ దాస్యం వినయ్భాస్కర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం అధునాతన పరికరాలు, వాటి పనితీరును చీఫ్ విప్ దాస్యం, వినోద్కుమార్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, మేయర్ గుండు సుధారాణి పరిశీలించారు.
ఈ సందర్భంగా హాస్పిటల్ నిర్వాహకులు వైద్యులు వేముల ప్రసాద్, చిలుకమాని గోపీనాథ్, మిట్టపల్లి శ్రీచరణ్ మాట్లాడుతూ అధునాతన సౌకర్యాలతోపాటు నిష్ణాతులైన వైద్యులతో అతి తక్కువ ధరలో వైద్యసేవలు అందించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హైదరాబాద్ లాంటి నగరానికి వెళ్లకుండా ఇక్కడే అన్నిరకాల వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన యాజమాన్యాన్ని చీఫ్ విప్, బోయినపల్లి అభినందించారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ సుందర్రాజ్యాదవ్, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, ఇండ్ల నాగేశ్వర్రావు పాల్గొన్నారు.