ములుగు టౌన్, జూలై 1: కలెక్టరేట్లో నూతనంగా నిర్మించిన జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని శుక్రవారం కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య ప్రారంభించారు. ఆయనకు జిల్లా వ్యవసాయ గౌస్ హైదర్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయ నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ ఫైలింగ్ రైతులకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులు ఉండొద్దన్నారు. కాగా, వాజేడు క్లస్టర్కు గాయత్రి, కన్నాయిగూడెం, గూర్రేవుల క్లస్టర్కు రాజేశ్వరి ఔట్ సోర్సింగ్ విధానంలో ఏఈఓలుగా నియామకం కాగా ఆర్డర్ పత్రాలను ఇచ్చారు. కలెక్టర్ ఎస్ కృష్ణ ఆర్డర్ పత్రాలను అందించారు. సీనియర్ అసిస్టెంట్ షరీఫ్, ఏవో వినయ్, సిబ్బంది ఉన్నారు.
ములుగు రూరల్ : వైద్యులు నిస్వార్థంగా సేవలు అందించాలని కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య అన్నారు. జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా ఉత్తమ వైద్యులకు డీఎంహెచ్ఓ అప్పయ్యతో కలిసి కలెక్టర్ ప్రశంసాపత్రాలను అందించి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంభించిన సమయంలో జిల్లాలోని వైద్యులు ప్రాణాలకు తెగించి మెరుగైన వైద్య సేవలు అందించారని కొనియాడారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. వైద్యులు విపిన్, వెంకటేశ్వర్లు, నరేశ్, సుకుమార్, నవీన్, అభినందన్, పుష్పనీల, అనిత, తేజశ్రీ పాల్గొన్నారు.