గిర్మాజీపేట, జూలై 1: డీఎంహెచ్వో కార్యాలయంలో శుక్రవారం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ మెడికల్, హెల్త్ ఫోరం సభ్యులు, డీపీవో అర్చన ఆధ్వర్యంలో వరంగల్, హనుమకొండ డీఎంహెచ్వోలు వెంకటరమణ, సాంబశివరావు, వరంగల్ అడిషనల్ డీఎం సుధార్సింగ్, ప్రోగ్రాం ఆఫీసర్లు చల్లా మధుసూదన్, గోపాల్రావుకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాల డీఎంహెచ్వోలు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పని చేసి ప్రజలకు విశేష సేవలు అందించారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా వారందరికీ డాక్టర్ డే శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత పల్లె దవాఖానలో ఉత్తమ సేవలందిస్తున్న గొర్రెకుంట డాక్టర్ ప్రణయ్రాజ్, ధర్మారం డాక్టర్ నేహానజీమా, రాంపూర్లో పని చేస్తున్న వైద్యుడు నగేశ్ను ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో టీఎన్జీవోస్ కోశాధికారి పాలకుర్తి సదానందం, టీఎన్జీవోస్ మెడికల్, హెల్త్ ఫోరం జిల్లా అధ్యక్షుడు మాడిశెట్టి శ్రీనివాస్, కార్యదర్శి రజినీకాంత్, డెమోలు అశోక్రెడ్డి, అనిల్, ఎస్వోలు ప్రసన్నకుమార్, విజయలక్ష్మి, కార్యాలయ ఉద్యోగులు జమాల్, త్రివేణి, రాధిక, సరిత, ప్రకాశ్రెడ్డి, రామలింగయ్య, నితిన్, వెంకటేశ్వర్లు, నాగరాజు, సుస్మిత, నరేశ్, మధు, విజయ్, శోభ పాల్గొన్నారు.
నర్సంపేట/రాయపర్తి/ఖానాపురం: నర్సంపేటలోని అక్షర స్కూల్లో డాక్టర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వైద్యుల వేషధారణలో ఆకట్టుకున్నారు. బాలాజీ విద్యా సంస్థల చైర్మన్డాక్టర్ అండృ రాజేంద్రప్రసాద్రెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. రాయపర్తిలోని పీహెచ్సీలో లయన్స్ క్లబ్ వర్ధన్నపేట నేతృత్వంలో వైద్యులు భూక్యా వెంకటేశ్, కొండూరి రవికుమార్ను ఘనంగా సన్మానించారు.
లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బిల్ల సుభాష్రెడ్డి, ప్రతినిధులు కొమురవెల్లి లింగమూర్తి, ప్రధాన కార్యదర్శి అల్లాడి సతీశ్కుమార్, మందాడి సుదర్శన్రెడ్డి, రాయపర్తి సర్పంచ్ గారె నర్సయ్య, బుద్ధ సునీల్కుమార్ పాల్గొన్నారు. ఖానాపురం మండలం ఐనపల్లి జ్యోతిబాఫూలే బాలికల పాఠశాలలో మండల వైద్యాధికారి మల్యాల అరుణ్కుమార్ను ఉపాధ్యాయులు, విద్యార్థులు సన్మానించారు. ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్/గీసుగొండ: వరంగల్ వాసవీకాలనీలోని ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో వాసవీకాలనీ ఇన్చార్జి బీకే వెష్ణవి సిస్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 23 మంది వైద్యులను సత్కరించారు. బ్యాంకుకాలనీలో కార్డియాలజిస్టు కూరపాటి మధును కాశీబుగ్గలోని వివేకానంద యోగా సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
కూరపాటి సుదర్శన్, వంగరి రవి, కూరపాటి రాజేశ్, మండల ఓంకారమూర్తి, సీహెచ్ సురేశ్, కుసుమ సురేశ్, మల్లేశం, కొక్కుల రవికుమార్ పాల్గొన్నారు. కొత్తవాడలో వైద్యులు కటకం నరేందర్, మేరుగు సుధాకర్ను సన్మానించారు. మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతి సత్యనారాయణ, డీసీసీబీ డైరెక్టర్ యెలుగం రవిరాజ్, వడ్డేపల్లి రాజబాబు, కొత్తపల్లి వినయ్, మొగిలి, రహీం, రాజు పాల్గొన్నారు.
దేశాయిపేటలోని అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ తంగళ్లపల్లి భరత్కుమార్ను హిందూ కల్చరల్ సొసైటీ అధ్యక్షుడు గజ్జల ఓంకారశాస్త్రి ఆధ్వర్యంలో సన్మానించారు. గునిగంటి రఘు, ఆశ వర్కర్ జ్యోతి పాల్గొన్నారు. రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీనివాసకాలనీలోని వైద్యురాలు విజయలక్ష్మి, న్యూరోఫిజీషియన్ మాధవ్రావును సత్కరించారు. డాక్టర్ ఏ రాజేంద్రప్రసాద్, ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ మోహన్, వారణాసి సాయి రాజేశ్ పాల్గొన్నారు. వరంగల్ 15వ డివిజన్ గొర్రెకుంట ప్రభుత్వ పాఠశాలలో గొర్రెకుంట మెడికల్ ఆఫీసర్ ప్రణయ్రాజును సన్మనించారు. హెచ్ఎం పోలెపాక అనిత, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రమాదేవి, రఘువీర్, లక్ష్మారెడ్డి, ఇందిర, ప్రణీత, కేదారి పాల్గొన్నారు.