గూడూరు, జూన్ 30 : అనునిత్యం శ్రమిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నందునే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. గురువారం మండలంలోని అప్పరాజుపల్లి గ్రామానికి వచ్చిన ఆయనకు మహిళలు బతుకమ్మలు, బోనాలతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అప్పరాజుపల్లితోపాటు జంగుతండా తండాకు చెందిన ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు సుమారు 300మంది టీఆర్ఎస్లో చేరగా వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శంకర్నాయక్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 24 గంటలు ప్రజల కోసం శ్రమిస్తూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నందువలనే ప్రజలు టీఆర్ఎస్ను ఆదిరిస్తున్నారని, వారి రుణం జన్మలో తీర్చుకోలేనని, కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రజలకు చేసిందేమీ లేదని, ఇక ముందు చేసేది కూడా ఏమీ ఉండదని, వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు. పల్లెప్రగతిలో భాగంగా కోట్లాది రూపాయలు వెచ్చించి గ్రామాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పలె ్లప్రకృతివనం, శ్మశాన వాటిక, డంపింగ్యార్డు వంటివి దేశంలోని ఏ గ్రామంలో కనిపించవని, ఒక్క తెలంగాణలోనే ఉన్నాయన్నారు. ఆసరా పింఛన్, రైతుబంధు, రైతు బీమా అమలులో కూడా మన రాష్ట్రమే ఆదర్శంగా నిలిచిందని, నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి మరోసారి పట్టం కట్టేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. అనంతరం మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా అప్పరాజుపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వేం వెంకటకృష్ణారెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ కాసీం, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం సంపత్రావు, వేముల వెంకన్న, మండల కార్యదర్శి నూకల సురేందర్, పట్టణ అధ్యక్షుడు చీదురు వెంకన్న, జయపాల్, కఠార్సింగ్, భాస్కర్, స్వామి, కిరణ్, వెంకన్న పాల్గొన్నారు.
కేసముద్రం, జూన్ 30: మండలంలోని అమినాపురం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు దం డు నగేశ్ ఈ నెల 29న అనారోగ్యంతో మృతి చెందా డు. గురువారం ఎమ్మెల్యే శంకర్నాయక్ నగేశ్ మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశాడు. నివాళులర్పించిన వారిలో మండల అధ్యక్షుడు నజీర్అహ్మద్, జడ్పీటీసీ రావుల శ్రీనాథ్రెడ్డి, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ దామరకొండ ప్రవీణ్కుమార్, నాయకులు కముటం శ్రీనివాస్, నీలం దుర్గేశ్, సర్పంచ్లు పురం రాజమణి, గంట సంజీవరెడ్డి, ఎన్నమల ప్రభాకర్, నా యకులు గుగ్గిళ్ల పీరయ్య, కంటిపూడి అరుణ్కుమార్, బిర్రు యుగేందర్, యాకాంబ్రం ఉన్నారు.