హనుమకొండ చౌరస్తా, జూన్ 30: ఎస్సెస్సీ ఫలితాల్లో ఎస్సార్ విద్యాసంస్థల విద్యార్థులు 228 మంది 10/10(జీపీఏ) సాధించి విజయకేతనం ఎగురవేసినట్లు విద్యాసంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి తెలిపారు. గురువారం హనుమకొండ కాకాజీకాలనీలోని ఎస్సార్ కళాశాలలో విద్యార్థులకు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వరదారెడ్డి మాట్లాడుతూ జిల్లాల్లో, రాష్ట్రంలో ఎస్సార్ విద్యాసంస్థలు సంచలనం సృష్టిస్తూ మరోమారు ఆధిపత్యాన్ని కొనసాగించించాయన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్య, పటిష్టమైన పాఠ్యప్రణాళిక, అంకితభావం కలిగిన ఉపాధ్యాయ బృందం ప్రో త్సాహంతోనే విద్యార్థులు ఇంతటి విజయాన్ని సాధించారన్నారు.
కరోనా కాలంలోనూ పక్కా ప్రణాళికలతో విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా బో ధించామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటిని ఆచరిస్తూ ఒత్తిడిలేని వాతావరణంలో, క్రమశిక్షణ సృజనాత్మకతతో కూడిన విద్యను అందిస్తున్నామన్నారు. పోటీ పరీక్షలను ఎదుర్కొనేవిధంగా ఎస్సార్ విద్యార్థులకు ఐఐటీ అండ్ మెడికల్ ఫౌండేషన్లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ అఖండ విజయాన్ని సాధించిన విద్యార్థులను, ప్రోత్సహించిన తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోష్రెడ్డి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.