మరిపెడ, జూన్ 24: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకం దళితులకు వరమని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. శుక్రవారం మరిపెడ మున్సిపల్ కేంద్రంలో చిన్నగూడూరు మండలం విస్సంపల్లి గ్రామానికి చెందిన చాగంటి శ్రీనివాస్ దళితబంధు డబ్బులతో ఏర్పాటు చేసిన శ్రీనిధి క్లాత్స్టోర్స్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. మండలంలోని విస్సంపల్లి, బీచురాజుపల్లి, ఎల్లారిగూడెం గ్రామాల్లోని వందమంది లబ్ధిదారులకు రూ.10లక్షల చొప్పున రూ.10 కోట్లు అందజేసినట్లు తెలిపారు.
అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికో 1500 మందికి లబ్ధి చేకూర్చనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంంలో ఎంపీపీ గుగులోత్ అరుణ, జిల్లా స్టాండింగ్ కమిటీ చైర్మన్, జడ్పీటీసీ తేజావత్ శారద, ఓడీసీఎంఎస్ మాజీ చైర్మన్ కుడితి మహేందర్రెడ్డి, చిన్నగూడూరు ఎంపీపీ వల్లూరి పద్మావెంకటరెడ్డి, జడ్పీటీసీ సునీతామురళిధర్రెడ్డి, రైతుబం ధు సమితి మండల కో ఆర్డినేటర్ మంగపతిరావు, కా లూనాయక్, ముఖేశ్, ఇస్లావత్ హుస్సేన్ పాల్గొన్నారు.
డోర్నకల్ : ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. శుక్రవారం వెన్నారం గ్రామం లో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ, ధ్వజస్తంభం ప్రతిష్ఠాపనోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోయినపల్లి వెంకన్న, విగ్రహల దాత బోయినపల్లి నాగేశ్వరావు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ వెంకన్న, పీఏసీఎస్ డైరెక్టర్ భిక్షం, నాయకులు శ్రీను పాల్గొన్నారు.
కురవి, జూన్24 : అలాగే నేరడ, మంచ్యతండాలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకల్లో ఎమ్మె ల్యే రెడ్యానాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఊక్లా తండా, సంకీసలో జరిగిన పెళ్లి వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట ఎంపీపీ గుగులోత్ పద్మారవినాయక్, ఎఫ్ఎస్సీఎస్సీ చైర్మన్ గోవర్ధన్, కాంపెల్లి సొసైటీ చైర్మన్ కొండపల్లి శ్రీదేవి, నాయకులు గుగులోత్ రవినాయక్, సర్పంచ్ అమ్రిబాయ్, మాలోత్ రమేశ్, మల్సూర్, శ్రీను, ఇంతమల్ల రాజు తదితరులు పాల్గొన్నారు.