సంపూర్ణ ఆరోగ్యానికి చక్కటి మార్గం.. యోగా అని సింగరేణి అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా
అన్ని ఏరియాల్లోని జీఎం కార్యాలయాలు, గనులపై మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయా చోట్ల ర్యాలీలు తీశారు. ఉద్యోగులు, కార్మికులతో యోగా శిక్షకులు పలు ఆసనాలు వేయించారు. యోగా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. సింగరేణి పని ఒత్తిడితో
కూడుకున్నదని, ప్రతి కార్మికుడూ నిత్యం యోగా చేయాలని సూచించారు. రోజూ అరగంట సాధన చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని, తద్వారా సింగరేణి ఆరోగ్యంగా ఉంటుందన్నారు. సీఎండీ శ్రీధర్,
సంస్థ వ్యాప్తంగా అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు.
భూపాలపల్లి, జూన్ 21 : జ యశంకర్ భూపాలపల్లి జిల్లా భూ పాలపల్లి ఏరియా జీఎం కార్యాల య ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో ఇన్చార్జి జీఎం బీవీ రమ ణ, యోగా గురువు మాధవాచారి, సింగరేణి అధికారులు జ్యోతి, అజ్మీరా తుకారాం, శివకేశవరావు, కృష్ణప్రసాద్, శ్రీనివాస్, శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మందమర్రి రూరల్, జూన్ 21 : మందమర్రి ఏరియాలోని జీఎం కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో జీఎం చింతల శ్రీనివాస్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, ఏఐటీయూసీ నాయకుడు దాగం మల్లేశ్, అధికారుల సంఘం అధ్యక్షుడు జక్కారెడ్డి, పీఎం వర ప్రసాద్, డీవై పీఎం శ్యామ్ సుందర్, ఐఈడీ రాజన్న, ఐటీ ప్రోగ్రామ్ ఆఫీసర్ రవి, ఫారెస్ట్ అధికారి రమణా రెడ్డి, కేఎస్ నాయకులు బడికెల సంపత్, శంకర్రావు, యోగా గురువు అనామిక పాల్గొన్నారు. 13 మంది యోగా గురువులను నియమించి, ఉదయం యోగా కార్యక్రమాలు నిర్వహించినట్లు జీఎం పేర్కొన్నారు.
కాసిపేట, జూన్ 21 : కాసిపేట 1వ గనిపై నిర్వహించిన కార్యక్రమంలో కాసిపేట గ్రూప్స్ ఏజెంట్ కుర్మ రాజేందర్, మేనేజర్ అల్లావుద్దీన్, టీబీజీకేఎస్ ఏరియా కార్యదర్శి వొడ్నాల రాజన్న, యోగా శిక్షకుడు రాజేశం, అధికారులు, యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి టౌన్, జూన్ 21 : బెల్లంపల్లి ఏరియాలోని శాంతిఖని గని ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో గని పీవో కే వెంకటేశ్వర్లు, టీబీజీకేఎస్ గని పిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్, గని మేనేజర్ సంజయ్కుమార్ సిన్హా, గ్రూప్ ఇంజినీర్ జీ కృష్ణమూర్తి, రక్షణ అధికారి పీ రాజు, డిప్యూటీ మేనేజర్ ముస్తఫా, సంక్షేమాధికారి శ్రీనివాసరావు, ఏఐటీయూసీ పిట్ కార్యదర్శి దాసరి తిరుపతి గౌడ్, ఇతర అధికారులు, యోగా శిక్షకుడు శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.
జైపూర్, జూన్ 21 : జైపూర్ విద్యుత్ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, సీఐఎస్ఎఫ్ జవాన్లు యోగా సాధన చేశారు. కార్యక్రమంలో సీటీసీ సంజయ్కుమార్, చీఫ్ ఆఫ్ అండ్ఎం జైన్సింగ్, సీఐఎస్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ యోగేశ్ కుమార్, పీఎంపీఎల్ అధికారి అఖిల్కుమార్, పర్సనల్ మేనేజర్ రామశాస్త్రి, సీనియర్ పీవో మురళి, సీఐఎస్ఎఫ్ అధికారులు పాల్రాజ్, సర్కార్ మల్లేశ్ పాల్గొన్నారు.
శ్రీరాంపూర్, జూన్ 21 : శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో జీఎం సంజీవరెడ్డి, యోగా గురువు మహేశ్, ఎస్వోటూ జీఎం త్యాగరాజు, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి, డీవైజీఎం గోవిందరాజు, చిరంజీవులు, అధికారులు అబ్దుల్ ఖాదీర్ పాల్గొన్నారు. ఎస్సార్పీ-3గనిపై మేనేజర్ సంతోష్కుమార్, యోగా గురువు లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో డిప్యూటీ మేనేజర్ మహేంద్రనాథ్, సేఫ్టీ ఆఫీసర్ అరుణ్కుమార్, టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి ఆర్ గోపాల్రెడ్డి, సీనియర్ పీవో టీ మోహన్సింగ్ పాల్గొన్నారు. అలాగే ఓసీపీపై మేనేజర్ జనార్దన్, యోగా గురువు గడ్డం రాజేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సేఫ్టీ ఆఫీసర్ వీరయ్య, ఈఈ శ్యాంసుందర్రావు, పిట్ కార్యదర్శి పెంట శ్రీనివాస్, ఈఈ సారంగపాణి పాల్గొన్నారు. ఆర్కే-5 గనిపై మేనేజర్ అబ్దుల్ ఖాదర్, యోగా గురువు దాసరి రాజేశం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో సీనియర్ పీవో రణధీర్గౌడ్, ఈఈ ఎల్లయ్య, రాజేశ్, సునీల్, సందీప్, ఆఫీస్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, సర్వేయర్ లక్షణ్, పిట్ కార్యదర్శి మహేందర్రెడ్డి, సత్యనారాయణ, వర్క్మన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ పాల్గొన్నారు. ఆర్కే-6 గనిపై మేనేజర్ ఈ తిరుపతి, యోగా గురువు దొమ్మటి పోశెట్టి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సేఫ్టీ ఆఫీసర్ శ్రీనివాస్, సీనియర్ పీవో సునీల్కుమార్, టీబీజీకేఎస్ ఏరియా చర్చల ప్రతినిధి వెంగళ కుమారస్వామి, పిట్ కార్యదర్శి చిలుముల రాయమల్లు, నాయకులు వెంకట్రాజం, భూమయ్య పాల్గొన్నారు. అలాగే ఆర్కే-7 గనిపై మేనేజర్ సాయి ప్రసాద్, యోగా గురువు సదానందం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి మెండ వెంకటి, సేఫ్టీ ఆఫీసర్ రవిశంకర్, ఈఈ ప్రవీణ్, రాంమోహన్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
రెబ్బెన, జూన్ 21 : బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి టౌన్షిప్లో సింగరేణి సేవా సమితి, ఏరియా యాజమాన్యం ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. వేడుకల్లో జీఎం దేవేందర్, టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సంగెం ప్రకాశ్రావు, ఏరియా ఎస్వోటూ జీఎం గుప్తా, ఏజీఎం తిరుమల్రావు, డీజీఎం(సివిల్) సతీశ్బాబు, డీజీఎం(ఐఈడీ) మోహన్, డీజీఎం(వర్క్షాప్) శివరామిరెడ్డి, పర్సనల్ మేనేజర్ ఐ లక్ష్మణ్రావు, డీవైపీఎం తిరుపతి, సేవా సమితి సభ్యులు కుందారపు శంకరమ్మ, సొల్లు లక్ష్మి, విజయ, కోమలి, కల్పన, యోగా శిక్షకులు రాజలింగు, రాజ్యలక్ష్మి, కేసరి అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.
గోదావరిఖని, జూన్ 21 : పెద్దపల్లి జిల్లా ఆర్జీ-1 జీఎం కార్యాలయంలో, జీడీకే-1,2,2ఏ,11, ఓసీపీ-5, ఏరియా దవాఖాన, సివిల్, ఏరియా వర్క్షాపు, తదితర విభాగాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో జీఎం కే నారాయణ, సీఎంవోఏఐ అధ్యక్షుడు పోనగోటి శ్రీనివాస్, ఎస్వోటూ జీఎం రాంమోహన్, డీజీఎం పర్సనల్ లక్ష్మీనారాయణ, ఏజీఎం రామకృష్ణ, అధికారులు జగన్మోహన్ రావు, కేవీ రావు, ఆంజనేయ ప్రసాద్, ఆంజనేయులు, అభిలాష్, వీరారెడ్డి, సారంగపాణి, దుర్గాప్రసాద్, యోగా శిక్షకులు రఘుసింగ్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
యైటింక్లయిన్ కాలనీ, జూన్ 21 : పెద్దపల్లి జిల్లా ఆర్జీ-2 జీఎం కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో జీఎం టీ వెంకటేశ్వర్రావు, టీబీజీకేఎస్ డివిజన్ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్, ఓసీపీ-3 పీవో జీ మోహన్ రెడ్డి, ఏరియా ఇంజినీర్ రాధాకృష్ణారావు, డీజీఎం (పా) జీ రాజేంద్రప్రసాద్, డీజీఎం(సీ) ధనుంజయ, డీజీఎం(ఐఈడీ) మురళీకృష్ణ, పర్యావరణ అధికారి రాజారెడ్డి, సెక్యూరిటీ అధికారి పీవీ రమణ, పీఎం అనిల్ కుమార్, డీవైపీఎం చంద్రమౌళి, ఎస్టేట్ అధికారి జే సునీత, ఐటీ మేనేజర్ సుబ్రమణ్యం, సీనియర్ పీవో వేణుగోపాల్, సివిల్ అధికారులు ప్రతాపగిరి రాజు, యశ్వంతరావు, రాధాకృష్ణ, జీఎం కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
రామగిరి, జూన్ 21 : పెద్దపల్లి జిల్లా ఆర్జీ-3 జీఎం కార్యాలయంతో పాటు గనులు, డిపార్ట్మెంట్లలో నిర్వహించిన కార్యక్రమాల్లో జీఎం మనోహర్, టీబీజీకేఎస్ ప్రతినిధి రామ్మూర్తి, వెంకటేశ్వర్లు, అధికారులు రఘుపతి, ఎలీషా, రాజశేఖర్ రెడ్డి, రామకృష్ణ, శ్రీనివాసులు, చంద్రశేఖర్, విలాస్ శ్రీనివాస్, రాజేశ్వరితో పాటు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.