రాయపర్తి, జూన్ 21: ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ చేరాలని, అర్హులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరుగకుండా చూడాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని వ్యవసాయ మా ర్కెట్ సబ్ యార్డు ఆవరణలో ఎంపీపీ జినుగు అనిమిరె డ్డి అధ్యక్షతన దళితబంధు పథకంపై మండల స్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ రాష్ట్రంలోని సబ్బండ వర్గాల అభివృద్ధే లక్ష్యంగా కోట్లాది రూపాయల వ్య యంతో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల ఫలాలన్నీ అందరికీ చేర్చాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధు లు, పార్టీ శ్రేణుల మీద ఉందని అన్నారు.
బలహీన వర్గాలుగా ఉన్న దళితులందరినీ ధనవంతులు చేయా లన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. మండలంలోని 39 గ్రామ పంచాయతీల పరిధిలో నివాసం ఉంటున్న దళి తులందరి సమాచారాన్ని ప్రజా ప్రతి నిధులు తయారు చేయాలని కోరారు. మండలంలోని దళితులందరికీ దళి తబంధు పథకాన్ని వర్తింపజేసేందుకు తాను శాయశక్తు లా కృషి చేస్తున్నట్లు చెప్పారు.
సమావేశంలో జడ్పీ టీసీ రంగు కుమార్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్, రైతుబంధు సమితి మం డల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, ప్రజాప్రతినిధు లు గారె నర్సయ్య, పూస మధు, అయిత రాంచందర్, గట్టు నర్సింహాచార్యులు, ఎండీ నయీం, సూదుల దేవేందర్రావు, ఎండీ ఉస్మాన్, బిల్ల సుభాష్రెడ్డి, సాగర్ రెడ్డి, కందికట్ల స్వామి, గబ్బెట బాబు పాల్గొన్నారు.