హనుమకొండ, చౌరస్తా, జనవరి 24: స్మార్ట్ సిటీ, హృదయ్, అమృత్, రూర్బన్ పథకాల ద్వారా రూ.3,268కోట్ల నిధులు తీసుకువచ్చి వరంగల్ పార్లమెంట్ను అభివృద్ధి చేసినట్లు ఎంపీ పసునూరి దయాకర్ తెలిపారు. బుధవారం హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పంచి, మెప్పించి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక నిధులు తీసుకువచ్చానని, బండి సంజయ్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు ఇన్ని నిధులు తీసుకురాలేదని చెప్పారు. విభజన హామీల్లో పొందుపరిచిన హామీలను వెంటనే అమలు చేయాలని, బయ్యారం ఉక్కు, కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ డివిజన్ గురించి అనేకసార్లు కేంద్రానికి వినతిపత్రం ఇచ్చినట్లు పేర్కొన్నారు. రామప్ప, ఖిలావరంగల్ను యునెస్కోలో చేర్చాలని ఎంపీలందరం కలిసి విన్నవించగా రామప్పకు యునెస్కో గుర్తింపు లభించిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, వ్యవసాయానికి 24గంటల కరెంట్, సాగునీరు ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆశీర్వాదం తనకు ఎల్లప్పుడూ ఉంటుందని, మొదటిసారి ఓట్లు వేసి దేశంలోనే 7వ స్థానం, రెండోసారి రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిపారని గుర్తుచేశారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, తాను ప్రజల మధ్యే ఉ న్నానని అన్నారు. కార్యకర్త స్థాయి నుంచి ఎంపీగా ప్రజలు ఆశీర్వదించారని, పనిచేసినవాళ్లను కేసీఆర్ గుర్తిస్తారన్నారు. తాను మళ్లీ పోటీ చేస్తానని, తమ ఎమ్మెల్యేలు లేని లోటు ఎంపీగా గెలిచి చూపిస్తానన్నారు. రూ.3వేల కోట్ల నిధుల పనులు చేసినప్పటికీ ఏ ఒక్క కాంట్రాక్టర్ వద్ద కమీషన్లు తీసుకోలేదన్నారు. బీఆర్ఎస్ నాయకు లు రాజ్కుమార్, రాజేందర్, పసునూరి రజినీకాంత్ పాల్గొన్నారు.
రూర్బన్ పథకం ద్వారా పర్వతగిరి మండలానికి మంజూరైన మొత్తం రూ.30 కోట్లు
ఆరు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల కోసం రూ.2.64 కోట్లు
ఘన వ్యర్థాల నిర్వహణ కోసం రూ.10లక్షలు
వ్యవసాయ ప్రాసెసింగ్ (49) రూ.11.18కోట్లు
టూరిజం డెవలప్మెంట్(5) రూ.5.81కోట్లు
హెల్త్ సబ్సెంటర్(9) రూ.1.79కోట్లు
స్కూల్లో వసతులు(33) రూ.2.78కోట్లు
కన్వెన్షన్ సెంటర్(పర్వతగిరి) రూ.2కోట్లు
అంగన్వాడీ బిల్డింగ్ నిర్మాణం(4) రూ.68లక్షలు
మినీ స్టేడియం రూ.25లక్షలు
ఓపెన్ జిమ్లు(6) రూ.33లక్షలు
ఈ-పంచాయతీలు (18) రూ.18 లక్షలు
363 జాతీయ రహదారి వెడల్పు రూ.104.23 కోట్లు
మహదేవపూర్ నుంచి భూపాలపల్లి రెండు లైన్ల రోడ్డు నాలుగు లైన్లుగా చేసేందుకు రూ.163.89కోట్లు
నేషనల్ హైవే 163 సుగమం చేసేందుకు రూ.194.59కోట్లు
సైడు కాలువలు, స్లాబుల నిర్మాణం రూ.1.85కోట్లు
నయీంనగర్ నాలా నిర్మాణం రూ.5.06కోట్లు
353 సిరొంచ ఆత్మకూరు రోడ్ భద్రతా పనులు రూ.54.85కోట్లు
163 ఫోర్లేన్ రోడ్లుగా వెడల్పు చేసేందుకు రూ.208.72కోట్లు
సీఎంఆర్ఎఫ్ రూ.128కోట్లు
69 ప్రాజెక్టులు రూ.948 కోట్లతో పనులు ఎంపిక అందులో పూర్తయినవి..
భద్రకాళి చెరువు, కట్ట రిపేరు
13 జంక్షన్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ రిపేరు
ఎంజీఎం హాస్పిటల్లో మురుగునీటిశుద్ధి కేంద్రం
సెంట్రల్, రీజినల్ లైబ్రరీలో ఫర్నిచర్ ఏర్పాటు
ఫాతిమా నుంచి సుబేదారి వరకు రోడ్డుకు ఇరువైపులా 2 కిలోమీటర్లు సైకిల్ ట్రాక్
రోడ్డు ఊడ్చే యంత్రాలు రెండు కొనుగోలు
500 సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు
సెంట్రల్, రీజినల్ లైబ్రరీ ఆధునీకరణ
పద్మాక్షిగుడి, పబ్లిక్గార్డెన్ ఆధునీకరణ
ఎన్హెచ్ నుంచి ప్రగతిసింగారం వయా శాయంపేట పత్తిపాక రూ.6.40కోట్లు
రేపాక నుంచి పరకాల రూ.5.22కోట్లు
చెన్నాపూర్ నుంచి రాజక్కపల్లి రూ.5.49కోట్లు
మొత్తం రూ.17.11కోట్లు
ఆట స్థలాల ఏర్పాటు.. ఓ సిటీ, హనుమకొండ, కీర్తినగర్, జక్కలొద్ది
రాంపూర్ డంప్యార్డు వద్ద 3లక్షల టన్నుల సేంద్రియ ఎరువుల యూనిట్
22 కిలోమీటర్ల మేర స్మార్ట్రోడ్ల ఏర్పాటు
37 ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల ఏర్పాటు
ప్రెసిడెన్సీ స్కూల్, నయీంనగర్ మోరీ వద్ద అడ్డుగోడ నిర్మాణం
ఉర్సుగుట్టు, ప్రగతినగర్లో ఘనవ్యర్థాల నిర్వహణ యూనిట్లు
ములుగు, నర్సంపేట, కరీంనగర్, ఖమ్మం రోడ్ల నుంచి వరంగల్ నగరానికి ప్రవేశద్వారాలు
ఘనపూర్ నుంచి ఐనవోలు వరకు రోడ్డు వెడల్పు రూ.16కోట్లు
నాగారం నుంచి కుందారం వయా నవాబుపేట రూ.4.55కోట్లు
ఘన్పూర్ నుంచి ఐనవోలు వయా కూనూరు గార్నెపల్లి వరకు రోడ్డు వెడల్పు రూ.20కోట్లు
పిట్టలగూడెం నుంచి కిందారం వయా బాంజిపేట రూ.4.01కోట్లు
ఆర్ అండ్ బీ రోడ్డు నుంచి పిట్టలగూడెం రూ.2.23కోట్లు
మొత్తం రూ.10.79కోట్లు రైల్వే..
పిరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్షాప్ మంజూరు రూ.338కోట్ల నుంచి రూ.650 కోట్లకు పెంపు
కాజీపేట వద్ద పిట్లైన్ల నిర్మాణానికి రూ.18కోట్లు
కాజీపేట రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.25కోట్లు
వరంగల్ రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.4కోట్లు
నష్కల్ అండర్పాస్, వంగపల్లి ఆర్వోబీ
కాజీపేట వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి
బీట్బజార్ వద్ద ఆర్వోబీ
వరంగల్ అండర్ బ్రిడ్జి వద్ద రెండో బ్రిడ్జి
ఘన్పూర్ వద్ద ఆర్యూబీ, ఆర్వోబీ
ఫాతిమానగర్ వద్ద బ్రిడ్జి, వందేభారత్ ట్రైన్
భద్రకాళి చెరువు ముందుతీరం అభివృద్ధి రూ.21.27కోట్లు
పద్మాక్షి టెంపుల్ అభివృద్ధి రూ.2.03కోట్లు
వేయిస్తంభాలగుడి అభివృద్ధి రూ.0.94కోట్లు
కాజీపేట దర్గా అభివృద్ధి రూ.1.78కోట్లు
వరంగల్ లైటింగ్ రూ.8.97కోట్లు మొత్తం రూ.35కోట్లు అమృత్
అమృత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మంజూరైన మొత్తం రూ.239.40కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.95.62కోట్లు, మున్సిపాలిటీ ద్వారా రూ.156.03కోట్లు మొత్తం రూ.491కోట్లు ఫీడర్ పైపులైన్లు 162 కిలోమీటర్లు డిస్ట్రిబ్యూషన్ పైప్లైన్ 1,757 కిలోమీటర్ల ట్యాంకులు 33 ఇంటికనెక్షన్లు 1,20,353.
గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా మహాత్మా ఘండి మెమోరియల్ ఆస్పత్రికి రూ.3కోట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా గిరిజన పాఠశాలలకు వాటర్ హీటర్లు లైటింగ్, మౌలిక వసతుల కోసం మంజూరు చేయించిన
ఆరెపల్లి నుంచి కంఠాత్మకూర్ వరకు రోడ్డు వెడల్పు రూ.20.20 కోట్లు
ఆరెపల్లి నుంచి కంఠాత్మకూర్ వరకు రోడ్డు వెడల్పు బిట్-2 రూ.12కోట్లు
ఓగ్లాపూర్ నుంచి ధర్మారం రోడ్ వరకు రోడ్డు వెడల్పు రూ.15కోట్లు
ధర్మారం నుంచి పులిగిల్ల వయా నడికూడ రూ.5.29కోట్లు,
కామారం నుంచి లక్ష్మీపురం వయా పెంచికలపేట వరకు రూ.4.83కోట్లు
కటాక్షాపూర్ నుంచి ప్రగతిసింగారం వరకు రూ.3.41కోట్లు
కాపుల కనపర్తి నుంచి సంగెం రూ.5.29కోట్లు
కామారం నుంచి లక్ష్మీపూర్ రూ.3.17కోట్లు
శ్రీనగర్ నుంచి ఎల్గూర్ రంగంపేట రూ.3.67కోట్లు
చౌటపల్లి నుంచి చింతనెక్కొండ రూ.3.99 కోట్లు
పర్వతగిరి నుంచి మేచరాజుపల్లి రూ.5.03కోట్లు
ధర్మసాగర్ నుంచి అనంతసాగర్ రూ.1.28కోట్లు
నెల్లుట్ల నుంచి నాంచారిమడూరు వరకు రోడ్డువెడల్పు రూ.10కోట్లు
నెల్లుట్ల నుంచి నాంచారిమడూరు వరకు రోడ్డు వెడల్పు బిట్-2 రూ.20కోట్లు
ఉప్పరగూడెం నుంచి పెద్దవంగర వరకు రోడ్డు వెడల్పు రూ.12కోట్లు
బమ్మెర నుంచి జఫర్గఢ్ వయా తమ్మడపల్లి వరకు రోడ్డు వెడల్పు రూ.12కోట్లు
కొత్తూరు నుంచి ల్యాబర్తి క్రాస్ రూ.4.81కోట్లు
రాయపర్తి నుంచి మహబూబ్నగర్ వయా పెరికేడ్ రూ.2.62కోట్లు
ఆర్ అండ్ బీ రోడ్ వర్ధన్నపేట తోబురాన్పల్లి రూ.10.11కోట్లు
పీడబ్ల్యూడీ అమ్మాపురం రోడ్ వద్ద బ్రిడ్జి రూ.2.99కోట్లు
పీడబ్ల్యూడీ తొర్రూరు నుంచి కొడకండ్ల వయా గంట్లకుంట, రంగాపూర్ రూ.4.04కోట్లు
అవుతాపూర్ నుంచి కొడకండ్ల వయా గంట్లకుంట, రంగాపూర్ రూ.4.04కోట్లు
కొత్తూరు నుంచి రోళ్లకల్ క్రాస్ రూ.6.11కోట్లు
దేవరుప్పుల నుంచి విస్నూరు వయా కొత్త గుడిసెలు రూ.9.72కోట్లు
సింగరాజుపల్లి నుంచి జీడికల్ వయా నీర్మాల రామరాజుపల్లి రూ.11.49కోట్లు
గూడూరు నుంచి ధర్మపురం వయా ఎర్రవెను, శాంతాపూర్ రూ.14.97కోట్లు
పాలకుర్తి నుంచి కొడకండ్ల వయా వల్మిడి ముత్తారం రూ.13.09కోట్లు
ఎర్రవెను నుంచి కంచనాపల్లి రూ.10.43కోట్లు
పాకాల నుంచి ఆర్ అండ్ బీ రోడ్ చెన్నూరు రూ.7.56కోట్లు
పాలకొండ తండా నుంచి ధర్మారం రూ.8.93కోట్లు మొత్తం రూ.111.63 కోట్లు