బచ్చన్నపేట ఫిబ్రవరి 23 : గ్రామంలో ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని జనగామ జిల్లా పడమటి కేశవాపూర్ సర్పంచ్ ఎర్రల విజయ అన్నారు. సోమవారం గ్రామంలోని పెద్దమ్మ ఆలయం, పోచమ్మ ఆలయాల వద్ద భక్తులకు నీటి సౌకర్యం కోసం రూ.24,000 వెచ్చించి రెండు ట్యాంకులను నిర్మించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఐదేళ్లు నాణ్యమైన సేవలు అందించడమే నా జీవిత లక్ష్యం అన్నారు. తమపై ఉన్న నమ్మకంతో సర్పంచ్ గా గెలిపించి మరింత బాధ్యత పెంచారని అన్నారు.
గ్రామంలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. ఆలయాల వద్ద భక్తులు పడుతున్న నేటి ఇబ్బందులను చూసి, తన సొంత ఖర్చులతో రెండు ఆలయాల వద్ద ట్యాంకులను నిర్మించామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దసలవారీగా అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజల సహకారం, ఉపసర్పంచ్, వార్డ్ సభ్యుల సలహాలు సూచనలతో గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాడేం నరేందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.