ఐనవోలు (హనుమకొండ), మార్చి 15 : హనుమకొండ జిల్లా మండలంలోని కొండపర్తి గ్రామానికి చెందిన మాజీ జిల్లా ఆత్మ డైరెక్టర్ కట్కూరి రాజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జాతీయ ఆవార్డును అందుకున్నారు. బహుజన సాహిత్య అకాడమీ ప్రతి సంవత్సరం అందజేసే ఆవార్డుల్లో భాగంగా ఆదివారం మాన్య శ్రీ కాన్షీరాం జయంతిని పురస్కరించుకొని బహుజన సాహిత్య అకాడమీ 18వ సౌత్ ఇండియా కాన్ఫరెన్స్ సభను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో నిర్వహించారు.
ఈ సభలోబహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణన్, కేరళ అధ్యక్షురాలు కళారాణి చేతుల మీదుగా కట్కూరి రాజు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆలోచన విధానాలను పాటిస్తూ జీవితంలో సమాజ సేవలో ముందుకు వెళ్తానని అన్నారు. తనను ఈ అవార్డుకు ఎంపిక చేసిన జాతీయ అధ్యక్షులు రాధాకృష్ణన్, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి విజయ్ కుమార్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి బొమ్మకంటి రవీందర్కు రాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.