హనుమకొండ, ఆగస్టు 7 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 15 రోజుల స్వతంత్ర భారత వజ్రోత్సవాలపై ప్రపంచం చర్చించుకోవడంతోపాటు వేడుకలు అంబరాన్ని తాకేలా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల ఏర్పాట్లు, నిర్వహణపై ఆదివారం హనుమకొండ కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన సమీక్షా సమావేశానికి చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి వజ్రోత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నందున ప్రతి ఒకరూ భాగస్వాములై విజయవంతం చేయాలన్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 15 రోజుల పాటు నిరంతరం ఒక పండుగ వాతావరణంలో వేడుకలు నిర్వహించాలన్నారు.
ఇందుకుగాను పార్టీలకతీతంగా దేశభక్తిని చాటేలా కార్యక్రమాల రూపకల్పన చేశామని మంత్రి తెలిపారు.
8వ తేదీన (నేడు) హైదరాబాద్లో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా ప్రారంభమై 22న ముగుస్తాయని పేర్కొన్నారు. అధికారులు చేపట్టే ప్రతి కార్యక్రమంలో సమన్వయం ఉండాలని సూచించారు. ప్రతి ఇంటికి జాతీయ పతాకం చేర్చడంతో పాటు ఎగురువేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ రైతులు, కళాకారులను ఎంపిక చేయాలని మంత్రి సూచించారు. కవి సమ్మేళన కార్యక్రమాలతో సభికులను అలరింపజేయాలని, గ్రామగ్రామాన ఫ్రీడం రన్ నిర్వహించాలన్నారు. స్వాతంత్య్ర సమరయోధులను ఘనంగా సన్మానించుకోవాలని, వన మహోత్సవ కార్యక్రమాలను చేపట్టి విస్తృతంగా మొకలు నాటాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులందరికీ ఉచితంగా గాంధీ చలనచిత్రాన్ని ప్రదర్శిస్తున్నందున థియేటర్ యజమానులు సహకరించి ఎక్కువ మంది తిలకించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకోసం సూళ్లకు ఉచితంగా బస్సులు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.
ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్లు
75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురసరించుకొని 57 ఏళ్లు నిండిన ప్రతి ఒకరికీ పింఛన్ మంజూరు చేయనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. అలాగే డయాలసిస్ పేషెంట్లకు సైతం ఆసరా పింఛన్లు ఇవ్వనున్నామన్నారు. ప్రస్తుతం పింఛన్లు తీసుకుంటు న్న వారికి, కొత్త వారికి త్వరలో కొత్తకార్డులు అందజేస్తామన్నారు.
జెండా పండుగ ఎప్పుడు జరుపలేదు..
దేశంలో ఎక్కడాలేని విధంగా ఇంత పెద్ద ఎత్తున జెండా పండుగ ఎప్పుడు జరుగలేదని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పేర్కొన్నారు. జెండా ఎగురవేసే విషయంలో నియమ నిబంధనలు పాటించాలన్నారు. రక్తదాన శిబిరంలో రెడ్క్రాస్ను భాగస్వాములు చేయాలన్నారు. నగరంలోని ఏదైనా పార్కులో ఇండియా మ్యాప్ ప్రకారం ప్లాంటేషన్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. క్రీడాకారులతో వినూత్నంగా కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. అలాగే ఏదో ఒక రోజు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనేలా క్రీడా కార్యక్రమాలు నిర్వహించాలని చీఫ్ విప్ కోరారు. సమావేశంలో ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్లు డాక్టర్ సుధీర్కుమార్, గండ్ర జ్యోతి, పాగాల సంపత్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్యాదవ్, రైతుబంధు సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు లలితాయాదవ్, వరంగల్, జనగామ జిల్లాల కలెక్టర్లు గోపి, శివలింగయ్య, హనుమకొండ అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రావీణ్య, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
15 రోజుల కార్యక్రమాలు ఇలా..
ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు 15రోజుల పాటు నిరంతరంగా చేపట్టే వేడుకల్లో పండుగ వాతావరణం కనిపించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు.
8న హైదరాబాద్లో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా ప్రారంభం అవుతాయి.
9న మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలు, ఏఎన్ఎం, ఆశ, అంగన్వాడీ టీచర్లు ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేయాలి.
10న విసృ్తతంగా వన మహోత్సవంలో అధికారులు పాల్గొని మొకలు నాటాలి. అలాగే బస్టాండ్, రైల్వేస్టేషన్లు, ముఖ్య కూడళ్లు, షాపింగ్ కాంప్లెక్స్, ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్తు దీపాలతో అలంకరించి భారీ హోర్డింగ్లు ఏర్పాటుచేయాలి.
11న జిల్లా క్రీడల అధికారి ఆధ్వర్యంలో క్రీడాకారులతో పాటు యువత స్వచ్ఛందంగా పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలి.
12న సోదరభావం, జాతీయ సమైక్యతను చాటిచెప్పేందుకు ఎన్జీవోలు రాఖీ పండుగ ఘనంగా నిర్వహించి కేబుల్ టీవీల్లో ప్రసారం చేయాలి.
13న ప్రతి ఒకరిలో సామాజిక స్పృహ కలిగించేలా విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఎన్జీవోలు కార్యక్రమాల్లో పాల్గొనాలి.
14న తెలంగాణ సాంసృతిక సారథులతో కార్యక్రమాలు, హెలిప్యాడ్ వద్ద క్రాకర్స్తో వేడుకలు నిర్వహించాలి.
15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి.
16న జిల్లాలో అన్నిచోట్ల ఒకే సమయంలో జాతీయ గీతాలాపన.. పోలీస్ శాఖ జాతీయ గీతం ఆలపించే సమయంలో కొద్ది సమయం పాటు రోడ్లను బ్లాక్ చేయాలి.
17న సుమారు 75 మందితో రక్తదానం చేయించాలి.
18న గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో ప్రణాళిక ప్రకారం క్రీడోత్సవాలు నిర్వహించాలి.
19న జిల్లాలోని హాస్పిటల్స్, పీహెచ్సీలు, వృద్ధాశ్రమాల్లో పండ్లు, స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలి.
20న రంగోలి కార్యక్రమంలో భాగంగా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయాలి.
21న సమావేశాలు నిర్వహించాలి.
22న ముగింపు వేడుకలు నిర్వహించాలి