మహదేవపూర్(కాళేశ్వరం),సెప్టెంబర్ 7 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్ట్లో అంతర్భాగమైన లక్ష్మీ(మేడిగడ్డ)బరాజ్కు వరద ప్రవాహం తగ్గుతున్నది. శనివారం బరాజ్ ఇన్ఫ్లో 5,39,200 క్యూసెక్కులు కాగా, ఆదివారం 4,51,920 క్యూసెక్కులకు తగ్గింది. బరాజ్లో మొత్తం 85 గేట్లు ఎత్తి అంతేమొత్తంలో నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.
బరాజ్ వద్ద గరిష్ఠ నీటి ప్రవాహం ఎత్తు సముద్ర మట్టానికి 100 మీటర్లు కాగా, ప్రస్తుత నీటి ప్రవాహం బరాజ్ రివర్ బెడ్ నుంచి 93.70 మీటర్ల ఎత్తులో ఉందని అధికారులు తెలిపారు. కాళేశ్వరంలో గోదావరి నది ప్రవాహం నిలకడగా, సుమారు 5.7మీటర్ల ఎత్తులో ఉందని తెలిపారు.