Hanumakonda : హనుమకొండలో విషాదం నెలకొంది. తెలంగాణ ఉద్యమ సమయంలో వందలాది మంది ఉద్యమకారులకు, విద్యార్థులకు ఉచితంగా భోజనం పెట్టిన హోటల్ యజమానులు ఆత్మహత్య చేసుకున్నారు. అద్దె చెల్లించడం లేదని షట్టర్ యజమాని కుమారుడు రాము .. కేదారి భార్య పుష్పలతను తీవ్ర పదజాలంతో దూషించాడు. అంతటితో ఆగకుండా అతడు హోటల్కు తాళం వేయడంతో మనస్తాపం చెందిన దంతపులు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా అద్దె చెల్లించలేదని కేదారి, పుష్ఫలత ఎంత బతిమిలాడినా రాము వినలేదు. పైగా వారిని అసభ్యకరంగా తిట్టాడు. అతడు హోట్లకు తాళం వేయడంతో మనస్తాపం చెంది ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న దంపతులు. భర్త కేదారి అక్కడికక్కడే మృతి చెందగా.. భార్య పుష్పలత ఎంజీఏం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించింది. కేదారి కుమారుడు పృథ్వీ ఫిర్యాదు మేరకు షట్టర్ యజమాని, అతడి కుమారుడు రాముపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అద్దె చెల్లించడం లేదని ఓనర్ చేసిన అవమానం భరించలేకే పెట్రోల్ పోసుకుని దంపతుల ఆత్మహత్య
హనుమకొండలో విషాద ఘటన
తెలంగాణ ఉద్యమ సమయంలో వందలాది మంది ఉద్యమకారులకు, విద్యార్థులకు ఉచితంగా భోజనం అందించిన హోటల్ యజమానులు ఆత్మహత్య
అద్దె చెల్లించడం లేదని హోటల్కు తాళం వేసి, కేదారి భార్య… pic.twitter.com/b0zNedBq7O
— Telugu Scribe (@TeluguScribe) September 11, 2026