హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 11: అనురాగ్ సొసైటీ ఛైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ కె.అనితారెడ్డి చేస్తున్న సమాజసేవను గుర్తించి చాకలి అయిలమ్మ బ్రేవరీ, సోషల్ జస్టిస్ అవార్డు-2026 అందించారు. కులమతాలకు అతీతంగా అందిస్తున్న సేవలు, మహిళల విద్యా, వైద్యం, ఆర్థిక ఎదుగుదలకు ఏర్పరుస్తున్న కార్యక్రమాలు, ఆరోగ్యకరమైన సమాజానికి, సన్మార్గమార్పుకు డాక్టర్ అనితారెడ్డి అందిస్తున్న సేవలను గుర్తించి నీతి అయోగ్య, మనం ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సంస్థ పౌండర్ చైర్మన్ అడ్వకేట్ డాక్టర్ చక్రవర్తి అవార్డుకు ఎంపిక చేసి అందచేశామని తెలిపారు.
మానవ హక్కుల పరిరక్షణ , కులమతాలను అరికట్టడంలో దైర్యం గా పోరాటం చేయడం, యువతను తీర్చిదిద్దుతున్న తీరు, సమాజంలో మహిళలు మోసపోకుండా ఉండేందుకు కల్పిస్తున్న అవగాహన కార్యక్ర మాలు చాలా స్పూర్తిగా ఉన్నాయని, అవి సమాజానికి చాలా ఉపయోగపడుతున్నాయని అందుకే ఈ ప్రతిష్టాకరమైన అవార్డును అనితారెడ్డికి ఇవ్వడం జరిగిందని, అదే చాకలి అయిలమ్మకి ఇచ్చే ఘన నివాళి అని చక్రవర్తి అన్నారు.
ఈ సందర్భంగా అనితారెడ్డి మాట్లాడుతూ ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని, బాద్యత మరింత పెరిగిందని, మహిళల ఎదుగుదల సమానత్వం కులమతాల కతీతంగా మనుష్యులు ఒకరికొకరు గౌరవించుకుని, సహకరించుకునే మార్పుచూడాలన్నదే నా ద్యేయమని, సమాజానికి విలువలతో కూడిన యువతను తయారు చేయడంలో కీలకమైన పాత్ర పోషించి మా వంతు సమాజాసేవ బాధ్యతగా చేస్తానన్నారు.