హనుమకొండ చౌరస్తా, జనవరి 23: కేయూ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో ‘ఇంటర్ కాలేజీయేట్ క్రాస్ కంట్రీ చాంపియన్ షిప్(పురుషులు, మహిళల) పోటీలను వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ ప్రారంభించారు. పురుషుల క్రాస్కంట్రీ విన్నర్ చాంపియన్షిప్ను హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కైవసం చేసుకోగా, రన్నర్గా ఖమ్మం విశ్వవిద్యాలయ వ్యాయామ కాలేజీ నిలిచింది. మహిళల విభాగంలో విన్నర్గా విశ్వవిద్యాలయ వ్యాయామ కళాశాల నిలువగా, రన్నర్గా టీటీడబ్ల్యూఆర్డీసీ(మహిళా), ఉట్నూర్ కాలేజీ నిలిచిందని విశ్వవిద్యాలయ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ఆచార్య శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో భాసర్, ఏటీబీటీ ప్రసాద్, సావిత్రి, జేత్య, ఉపేందర్, రమేష్, రామాంజనేయులు పాల్గొన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశ్వవిద్యాలయ విశ్రాంత బోధన, బోధనేతర ఉద్యోగుల క్రీడలను వీసీ రమేశ్ ప్రారంభించారు. వాలీబాల్, బాల్బ్యాడ్మింటన్, టెన్నిస్ ప్రీ ఫైనల్ జరిగినట్లు ఆచార్య ఎర్రగట్టు స్వామి, సంగాల గిదియన్ తెలిపారు.