నయీంనగర్, మార్చి 30 : నియోజక వర్గంలోని అన్ని గ్రామాల ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు నిత్యం ప్రజా క్షేత్రంలో పర్యటించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ కోరారు. గురువారం హనుమకొండ ప్రశాంత్నగర్లోని ఉన్న ఎమ్మెల్యే నివాసంలో వర్ధన్నపేట మండల బీఆర్ఎస్ సమన్వయ కమిటీ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలని కోరారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ బలోపేతానికి కృషిచేయాలన్నారు. అందరూ కలిసికట్టుగా ముందుకు సాగినప్పుడే మండలాల అభివృద్ధి వేగవంతం అవుతుందని వివరించారు. సమావేశంలో మండల సమన్వయ కమిటీ నాయకులు తూళ్ల కుమారస్వామి, అన్నమనేని అప్పారావు, మార్గం భిక్షపతి, కౌడగాని రాజేశ్ఖన్నా, గుజ్జ సంపత్రెడ్డి, కమ్మగాని స్వామిరాయుడు, చొప్పరి సోమయ్య పాల్గొన్నారు.
కరీమాబాద్ : శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా 43 డివిజన్లోని పలు ఆలయాల్లో నిర్వహించిన సీతారాముల కల్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలు, వర్గాల ప్రజలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అరుణ పాల్గొన్నారు.