కాజీపేట/ఖిలావరంగల్, మార్చి 12 : వందేభారత్ రైళ్లను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని రైల్వే సీనియర్ డీఈఈ ప్రశాంత్ కృష్ణసాయి కోరారు. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య కొత్తగా ప్రవేశపెట్టిన వందే భారత్ రెండో రైలును ప్రధాని మోదీ ఢిల్లీ వేదికగా వర్చువల్గా ప్రారంభించారు. అలాగే, కాజీపేట రైల్వే జంక్షన్లో ఏర్పాటుచేసిన చేనేత స్టాల్స్ను కూడా ప్రారంభించారు. సికింద్రాబాద్ నుంచి వచ్చిన వందేభారత్ రైలుకు కాజీపేట రైల్వే జంక్షన్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వాగతం పలికారు.
స్టేషన్ మాస్టర్ సత్యనారాయణరెడ్డి, సీసీఐ సజ్జన్లాల్, సీటీఐ విజయ్కుమార్, టెస్కో హ్యాండ్లూమ్ డీఎంవో కృష్ణహరి, రైల్వే జనరల్ ఇన్స్టిట్యూట్ సెక్రటరీ దేవులపల్లి రాఘవేందర్ పాల్గొన్నారు. అలాగే, వరంగల్ రైల్వేస్టేషన్లో ‘ఒకే స్టేషన్ ఒక ఉత్పత్తి’ అనే నినాదంతో ఏర్పాటు చేసిన స్టాల్ను సీనియర్ డీఎంఏ స్వరాజ్కుమార్ ప్రారంభించారు. రెండో వందే భారత్ రైలుకు స్వాగతం పలికారు. డీఎస్టీ హేమంత్కుమార్, ఏడీఈఈ రాజమోహన్, సీసీఐ రాజగోపాల్, ఎస్ఎంఆర్ బలరాం నాయక్ పాల్గొన్నారు.