న్యూశాయంపేట : హిందూ సంస్కృతి ( Hindu Culture) ని కాపాడుతూ సమాజ కల్యాణానికి హిందువులందరూ సంఘటితంగా కావాలని విశ్వబ్రహ్మ వీరధర్మస్వామి ( Veera Dharma Swamy ) పిలుపునిచ్చారు. ఆదివారం హంటర్రోడ్డులోని అభిరాం గార్డెన్లో న్యూశాయంపేట బస్తీ హిందూ సమ్మేళనం ( Hindu Sammelanam ) తాళ్లపల్లిశ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూఢనమ్మకాలను వదిలేసి మతం మారిన హిందూ బంధువులందరినీ తిరిగి పునరాగమనం చేయడానికి కృషి చేయాలన్నారు. విశ్వహిందు పరిషత్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఆకారపు కేశవరాజు మాట్లాడుతూ కాకతీయుల పౌరుష పరాక్రమాలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి కుటుంబం హిందూధర్మ విలువలను పాటించాలని సూచించారు.
సమాజంలో జరుగుతున్న వికృతులను చర్చించి అటువైపునకు వెళ్లకుండా నేటి తరాలనుకాపాడుకోవాలని పేర్కొన్నారు. ప్రతి ఇంటి నుంచి హిందూ ధర్మ రక్షణకు కదలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వీరమనేని రవీందర్ రావు, కోశాధికారి గుజ్జుల రాంచంద్రం, కీర్తి లక్ష్మయ్య, ఆర్ఎస్ఎస్ నాయకులు చిలకమారి సంజీవ, రమేష్, సంయోజక్ జూలపల్లి కరుణాకర్, మహిళా జర్నలిస్టు దేవికారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.