మహబూబాబాద్ రూరల్, మార్చి 26 : మహబూబాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీ వార్డు కౌన్సిలర్ మార్నేని వెంకన్నను కౌన్సిలర్లు మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్పై వార్డు కౌన్సిలర్లు ఈనెల 4న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా నెగ్గింది. దీంతో అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు వైస్ చైర్మన్ ఎన్నిక కోసం మంగళవారం మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీలో మొత్తం 36 మంది వార్డు కౌన్సిలర్లు ఉండగా, 32 మంది వార్డు కౌన్సిలర్లు, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎంపీ మాలోత్ కవిత సమావేశానికి హాజరయ్యారు. ముగ్గురు వార్డు కౌన్సిలర్లు హాజరు కాలేదు. ఒక్కరు అకాల మరణం చెందారు. కాగా, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం మార్నేని వెంకన్నను 1వ వార్డు కౌన్సిలర్ వెన్నం లక్ష్మారెడ్డి ప్రతిపాదించగా, 29వ వార్డు కౌన్సిలర్ సూర్ణపు సోమయ్య బలపరిచారు. అందరూ చేతులు ఎత్తి మార్నేని వెంకన్నకు మద్దతు తెలిపారు. దీంతో వెంకన్న ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి అలివేలు ప్రకటించారు. సభ్యుల సమక్షంలో వైస్ చైర్మన్ వెంకన్నకు ధ్రువీకరణ పత్రం అందజేశారు. పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఎంపీ, ఎమ్మెల్సీ, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు నూతనంగా ఎన్నికైన వైస్ చైర్మన్ వెంకన్నను ఘనంగా సన్మానించారు.
మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా సక్రమంగా నిర్వర్తిస్తా. మున్సిపాలిటీ పరిధిలో మరింత అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టిసారిస్తా. వార్డుల్లో మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటా. మున్సిపాలిటీ పరిధిలో అన్ని పార్టీలకు చెందిన వార్డు కౌన్సిలర్లు తనపై నమ్మకంతో మద్దతు తెలిపినందుకు ప్రత్యేక