నర్సంపేట, జనవరి 21: వీడియో గ్రాఫర్స్ మృతితో న ర్సంపేటలో విషాధం అలుముకుంది. నర్సంపేటకు చెందిన వీడియో గ్రాఫర్స్ ఫ్రీ వెడ్డింగ్ షూటింగ్ కోసం వెళ్తుండగా, ఖమ్మం జిల్లా ఇల్లందులో జరిగిన రోడ్డు ప్రమాదంలో న ర్సంపేటకు చెందిన ఓదెల కల్యాణ్, కొంపెల్లి శివకోటి మృతి చెందారు. వరంగల్కు చెందిన బైరి రాము, అరవింద్ ప్రాణాలు కోల్పోయారు. కాగా, నర్సంపేట పట్టణానికి చెందిన క్రాంతి రణదేవ్కు తీవ్ర గాయాలవడంతో హైదరాబాద్లో చికిత్స పొందుతున్నాడు. వరంగల్కు చెందిన వారి ప్రీ వెడ్డింగ్ షూట్ను భద్రాచలం పరిసర ప్రాంతాలు, మారెడ్మిల్ ప్రాంతంలో తీసేందుకు వెళ్తున్నారు. వీరు రాత్రి ఒంటి గంటకు కారులో వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది.
ఈ ఘనటలో వీడియో గ్రాఫర్స్ అక్కడికక్కడే మృతి చెందారు. కల్యాణ్కు రెండున్నరేళ్ల పాప భార్య ఉంది. శివకోటికి ఇద్దరు చిన్న పిల్లలున్నారు. భార్య ఉంది. శివకోటి, కల్యాన్ ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబాలు కోలుకోలేని దెబ్బ తగిలింది. వీడియో, ఫొటో గ్రాఫర్స్ మృతితో ఫొటో స్టూడియోలు అన్నింటిని నర్సంపేటలో బంద్ పాటించారు. రోడ్డు ప్రమాదంలో వీరు మృతి చెందారన్న వార్త నర్సంపేటకు చేరడంతో కుటుంబ సభ్యులు ఖమ్మం జిల్లా ఇల్లందుకు తరలివెళ్లారు. అక్కడ మృతదేహాలకు పోస్టు మార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. నర్సంపేటలో కల్యాణ్, శివకోటి మృతదేహాలు రావడంతో అంత్యక్రియలను నిర్వహించారు. వీరి మృతదేహాలపై పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రోడ్డు ప్రమాద మృతులకు సంతాపం..
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వీడియో గ్రాఫర్స్కు పలువురు సంతాపం తెలిపారు. ఫొటో, వీడియో గ్రాఫర్స్ సంఘం ఆధ్వర్యంలో శాంతిర్యాలీని నిర్వహించారు. నర్సంపేటలో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం సంతాపం ప్రకటించారు. వీడియో గ్రాఫర్స్ యూనియన్ నాయకులు, డివిజన్లోని వీడియో గ్రాఫర్స్, ఫొటో గ్రాఫర్స్ పాల్గొని నివాళులర్పించారు. వారి కుటుంబాలకు సానుభూతిని ప్రకటించారు. పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సంతాప సూచకంగా నర్సంపేటలో వీడియో, ఫొటో స్టూడియోలు బందు పాటించాయి. సంఘం నాయకులు అధ్యక్షుడు సురేశ్, కార్యదర్శి దొంతి సంతోష్, కోశాధికారి సోమేశ్వర్, నరేశ్, అమరేందర్, కార్తీక్, శ్యాం, పుట్టరాజు, మురళి, నరేశ్, వెంకట్, శంకర్, దుర్గేశ్గౌడ్, తాటికొండ శివ, జావిద్, భిక్షపతి, అన్నరాజు, తదితరులు పాల్గొన్నారు.