నర్సంపేట, జనవరి 2 : నర్సంపేట నుంచి తిరుపతికి బస్సు సర్వీస్ ప్రారంభమైంది. ప్రయాణికుల సౌకర్యార్థం నర్సంపేట నుంచి తిరుపతికి ఆర్టీసీ బస్సు నడపాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఈ మేరకు పదో వార్డు కౌన్సిలర్ నాగిశెట్టి పద్మాప్రసాద్, ఆర్టీసీ డీఎం విజయమాధురి తదితరులు సోమవారం బస్సు సర్వీసును ప్రారంభించారు.
ఈ బస్సు నర్సంపేట బస్టాండ్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 8 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతిలో ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 8 గంటలకు నర్సంపేటకు చేరుకుంటుంది. టికెట్ ధర రూ.1280గా నిర్ణయించారు. స్వామి వారి దర్శనం టికెట్ కూడా ఇప్పిస్తామని అధికారులు తెలిపారు.