హనుమకొండ, ఫిబ్రవరి 28 : రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖలో పని చేస్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో పలువురు బదిలీ అయ్యారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల విభాగంలో హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జీ ములుగు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా, ములుగు అదనపు కలెక్టర్ వేణుగోపాల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా బదిలీ చేశారు. సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ ఏ వెంకట్రెడ్డికి హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా పోస్టింగ్ ఇచ్చారు.
అలాగే డిప్యూటీ కలెక్టర్ల విభాగంలో పరకాల ఆర్డీగా విధులు నిర్వర్తిస్తున్న కే శ్రీనివాస్ను కల్లూరుకు, భూపాలపల్లి ఆర్డీవో కే రమాదేవిని మెదక్ ఆర్డీవోగా, వరంగల్ ఆర్డీవో ఎం వాసుచంద్రను నారాయణపేట ఆర్డీవోగా, స్టేషన్ ఘన్పుర్ ఆర్డీవో కే రామ్మూర్తిని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ ఏటూరునాగారం, హనుమకొండ ఆర్డీవో ఎల్ రమేష్ను సిరిసిల్ల ఆర్డీవోగా, జనగామ ఆర్డీవో మురళీకృష్ణను హైదరాబాద్లోని జనరల్ అడ్మినిస్ట్రేషన్కు, ట్రైబల్ వెల్ఫేర్ ఏటూరునాగారం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డీఎస్ వెంకన్నను స్టేషన్ ఘన్పుర్ ఆర్డీవోగా, నారాయణఖేడ్ ఆర్డీవో ఎన్ వెంకటేశ్ను హనుమకొండ ఆర్డీవోగా, భూపాలపల్లి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (భూసేకరణ) కే నారాయణను పరకాల ఆర్డీవోగా బదిలీ చేశారు. అదే విధంగా ఆదిలాబాద్ ఆర్డీవో స్రవంతి బ్రహ్మరాతును వరంగల్ ఆర్డీవోగా, ఆర్మూర్ ఆర్డీవో టీ వినోద్కుమార్ను భూపాలపల్లి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ఎల్ఎ)గా, భద్రాచలం ఆర్డీవో ఎం మంగీలాల్ను భూపాలపల్లి ఆర్డీవోగా, హైదరాబాద్లో స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్గా విధులు నిర్వర్తిస్తున్న డీ కొమురయ్యకు జనగామ ఆర్డీవోగా పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.