వరంగల్, నవంబర్ 3(నమస్తేతెలంగాణ): తరగతి, సబ్జెక్టు వారీగా కనీస సామర్థ్యాల సాధన నుంచి తరగ తి స్థాయి సామర్థ్యాలను సాధించడానికి కృషి చేయా లనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్ర మాన్ని రూపొందించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ‘సామర్థ్యాలు- అభ్యసన ఫలితాలు’ సాధన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రాధమిక స్థాయిలో అమ ల్లోకి తెచ్చింది. ఈ మేరకు విడుదలైన మార్గదర్శకాల ప్రకారం విద్యాశాఖ అధికారులు గత ఆగస్టు 16 నుంచి జిల్లాలో విద్యార్థుల స్థాయి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీటితో విద్యార్థి స్థాయిని తెలుసుకొని అందుకనుగుణంగా అన్ని సబ్జెక్టుల్లో నిర్దిష్ట ప్రణాళికలు తయారు చేశారు. సామర్థ్యాల వారీ అభ్యసన ఫలితా లను సాధించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. జిల్లాలో 482 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథ మికోన్నత పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు మౌలిక భాష, గణిత సామర్థ్యాల సాధ నకు తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ పాఠశాలల్లో సుమారు 22 వేల మంది విద్యార్థులు ఉన్నారు.
ప్రాథమిక స్థాయిలో ఒకటి నుంచి ఐదో తర గతి వరకు బోధిస్తున్న ఉపాధ్యాయులు ఈ కార్యక్ర మాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఆయా తరగతికి చెందిన అభ్యసన ఫలితాలను సాధించేందుకు అవస రమైన కనీస సామర్థ్యాలను, ఆ తర్వాత తరగతి వారీ అభ్యసన ఫలితాలను సాధించడమే టార్గెట్గా పెట్టుకు న్నారు. తెలుగు ఒకటో తరగతిలో ‘బొమ్మలు- పదా లు’ అనే పాఠాన్ని వినియోగించడం, రెండో తరగతిలో 1 నుంచి 5 పాఠాల్లోని అభ్యాస కృత్యాలు, 3, 4, 5 తరగతుల్లో సంసిద్దత పాఠాలు, అభ్యాసాలు, గణితం 1 నుంచ 5 తరగతుల్లో యూనిట్కు సంబంధించిన చిత్రాలను పరిశీలింపజేస్తూ పూర్వగణిత భావనల నుంచి ప్రస్తుత భావనలను పరిచయం చేయడం, వ్యక్తి గతంగా, జట్టుల్లో అభ్యసన కృత్యాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల సాధనపై పోకస్ పెట్టారు. ఇక పాఠ్యపుస్తకంలో ఉన్న పాఠాలు, అభ్యా సాలు, అభ్యసన ఫలితాలను సాధించేందుకు ఉద్దేశించి న కృత్య రూపంలో గల వాటిని సాధన చేయడం ద్వారా తరగతి వారీ అభ్యసన ఫలితాలను సాధించ వచ్చని ప్రభుత్వం భావిస్తుంది. పాఠశాలల్లో ఉపాధ్యా యుల బోధన, అభ్యాసానికి తగిన సమయం కేటా యించి బోధనాభ్యసన ప్రక్రియ నిర్వహిస్తున్నారు. తెలుగు, గణిత బోధనకు 90 నిమిషాలు, ఆంగ్లం, ఈవీఎస్ బోధనకు 45 నిమిషాలు ఉండేలా పీరియడ్ ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇందులో భాగంగా తెలుగు, గణితంలో 45 నిమిషాలు బోధన, మిగిలిన 45 నిమిషాలు అభ్యాసం కోసం కేటాయిస్తున్నారు.
స్థాయికి అనుగుణంగా ప్రణాళిక
తొలిమెట్టు కార్యక్రమం అమలుకు స్థాయికి అనుగు ణంగా విద్యాశాఖ అధికారులు ప్లాన్ చేశారు. వార్షిక, వారపు, పాఠ్య, పీరియడ్ ప్రణాళిక ప్రకారం ఉపాధ్యా యులు తరగతి గదుల్లో బోధిస్తున్నారు. వారంలో ఐదు రోజులు బోధించి ఒకరోజు మదింపు జరుపుతు న్నారు. వరసగా ఐదురోజులు బడికి రాని పిల్లల తల్లి దండ్రులతో మాట్లాడి కారణాలు తెలుసుకుంటూ నెలకు ఒకరోజు విద్యార్థి వారీగా అన్ని సబ్జెక్టుల్లో ప్రగతి నమోదు చేస్తున్నారు. కాంప్లెక్స్, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నెలనెల ఈ కార్యక్రమంపై సమీక్ష జరుగు తుంది. కాంప్లెక్స్ స్థాయిలో 25 నుంచి 26వ తేదీలో గా, మండల స్థాయిలో 27న, జిల్లా స్థాయిలో 28న, రాష్ట్ర స్థాయిలో 30న విద్యాశాఖ అధికారులు తొలిమె ట్టు ప్రగతి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఒక్కో కాంప్లెక్స్ పరిధిలో 15 నుంచి 20 పాఠశాలలు ఉండగా జిల్లాలో ఇలాంటి కాంప్లెక్స్లు 45 పనిచేస్తు న్నాయి. ప్రతి కాంప్లెక్స్ స్థాయిలో హెచ్ఎం, పదమూ డు మండలాల్లో మండల స్థాయి నోడల్ అధికారులతో పాటు జిల్లా స్థాయిలో విద్యాశాఖ జిల్లా అధికారి డీ వాసంతి, జిల్లా అకాడమిక్ కోఆర్డినేట ర్ సారయ్య, మండల విద్యాశాఖ అధికారులు తొలిమెట్టు కార్యక్ర మం అమలును పర్యవేక్షిస్తున్నారు. ఆగస్టు 16న అమ ల్లోకి వచ్చిన ఈ కార్యక్రమం 140 రోజుల పాటు కొన సాగనుంది. కలెక్టర్ బీ గోపి, డీఈవో వాసంతి, అకా డమిక్ కోఆర్డినేటర్ సారయ్య, మండల నోడల్ అధికా రులు, కాంప్టెక్స్ హెడ్మాస్టర్లు తమ పరిధిలో ఉన్న ప్ర భుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను కొద్ది రోజుల నుంచి సందర్శించి తొలిమెట్టు కార్యక్ర మాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా పాఠశాల హెచ్ ఎం, టీచర్లు, విద్యార్థులతో మాట్లాడి బోధన తీరు తెలుసుకున్నారు. ప్రస్తుతం విద్యాశాఖ అధికారులు ఈ కార్యక్రమం అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు.