వెంకటాపురం(నూగూరు), జూలై 21 : మావోయిస్టుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురు నకిలీ మావోయిస్టులను శుక్రవారం ములుగు జిల్లా వెంకటాపురం(నూగురు) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సీఐ కాగితోజు శివప్రసాద్ వివరాలు వెల్లడించారు. మా వోయిస్టు ఏరియా కార్యదర్శి సుధాకర్ పేరుతో ఇసుక కాంట్రాక్టర్ల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో వెంకటాపురం ఎస్సై తిరుపతిరావు, సిబ్బందితో కలసి వెంకటాపురం గ్రామ శివారులో వాహన తనిఖీలు చేశారు.
ఈ క్రమంలో గ్రామ శివారులో ము గ్గురు వ్యక్తులు బ్యాగులతో అనుమానాస్పదంగా కనిపించి పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నా రు. వారి నుంచి రూ.10వేల నగదు, రెం డు బొమ్మ తుపాకీలు స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారించగా వెంకటాపురం మండలం మంగవాయి గ్రామానికి చెందిన తాటి సురేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా జారువ-కరకేలి గ్రామానికి చెందిన ముఉండా మంగులు, ఇదే జిల్లా కాఉండే గ్రామానికి చెందిన గోట రాజేశ్ అని చెప్పారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.