ఖానాపురం,జనవరి 16: వివాహిత మృతికి కారకులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని మనుబోతుల గడ్డలో సోమవారం మృతురాలి బంధువులు రాస్తారోకో నిర్వహించారు. బాధ్యులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత యువతి కుటుంబసభ్యులు తెలి పిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భూక్యా ఈర్యా (డోలి), బిచిని దంపతుల చిన్న కుమార్తె అనూషకు(24) ఇదే మండలంలోని బండమీదిమామిడితండాకు చెందిన మూడు రమేశ్తో గతేడాది ఫిబ్రవరిలో వివాహమైంది.
ప్రస్తుతం అనూష 3 నెలల గర్భవతి. వారి పెళ్లికి ముందు నుంచే అనూష, తాను ప్రేమించుకుంటున్నామంటూ ఆరు నెలల క్రితం మను బోతులగడ్డ గ్రామానికి చెందిన ఉస్మాన్ వారిద్దరు కలిసున్న ఫొటోలను భర్త రమేశ్ ఫోన్కు పంపిం చాడు. దీంతో ఈ విషయాన్ని రమేశ్ అనూష తల్లిదండ్రు లకు తెలియజేయడంతో వారు సర్పంచ్ సోమయ్యను ఆశ్ర యించగా ఉస్మాన్తో పాటు అతడి తల్లిదండ్రులను పిలి పించి ఆగ్రహం వ్యక్తం చేసి, మరోసారి ఇలాంటి సంఘట నలు పునరావృతం కావద్దని గట్టిగా మందలించి పంపించా డు.
మళ్లీ నెల రోజుల క్రితం నుంచి ఉస్మాన్ మరి కొంత మందితో కలిసి అనూషను వేధిస్తుండడంతో పది రోజుల క్రితం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఉస్మాన్ను మంద లించాల్సిన ఎస్సై తిరుపతి అతడిపై ఎలాంటి చర్యలు చేప ట్టకపోగా అనూషను అసభ్యపదజాలంతో దూషించాడు. దీంతో అనూష గత సోమవారం పురుగుల మందు తాగ గా, వరంగల్ ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. కాగా, తమ కుమార్తె మృ తికి కారణమైన ఉస్మాన్, మస్తాన్, ఇమామ్సాబ్, సర్వర్, అనిల్, సైదులుపై అట్రాసిటి కేసు నమోదు చేయాలని, అదే విధంగా పోలీస్స్టేషన్ ఫిర్యాదు చేసిన పట్టించు కోకుండా నిర్లక్ష్యం చేసిన ఎస్సైని సస్సెండ్ చేయాలని మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు ఖానాపురం రెండో బస్టాం డ్ సెంటర్లో రాస్తారోకో చేశారు.
పోలీసులతో వాగ్వా వాదానికి దిగారు. దీంతో నర్సంపేట ఏసీపీ సంపత్కు మార్, నర్సంపేట రూరల్ సీఐ సూర్యప్రసాద్, టౌన్ సీఐ పులి రమేష్, నర్సంపేట ఎస్సై సురేష్ బాధితులతో మాట్లాడి బాధ్యులపై తక్షణమే చర్యలు చేపడతామని, ఎస్సైపై పూర్తిస్థాయి విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. గ్రామంలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఆధ్వర్యంలో అంత్యక్రియలను పూర్తి చేశారు.