పర్వతగిరి, డిసెంబర్ 1 : టీఆర్ఎస్ను క్షేత్ర స్ధాయిలో బలోపేతం చేయడంపై మండల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, గ్రామ ఇన్చార్జిలతో గురువారం పార్టీ జిల్లా అధ్యక్షు డు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ సమీ క్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాల అమలు, నాయకుల పని తీరు, అభివృద్ధి పనుల వివరాలపై చర్చించారు. అందరూ సమన్వయంతో పని చేసి మండల అభివృద్ధికి పాటు పడాలని సూచించారు.
సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, ఎంపీపీ కమల, జడ్పీటీసీ సింగ్లాల్, పీఏసీఎస్ చైర్మన్ మనోజ్కుమార్గౌడ్, వైస్ ఎంపీపీ రాజేశ్వర్రావు, మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు, చిన్నపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.