వరంగల్, నవంబర్ 15: వరంగల్, హనుమకొండ జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను బుధవారం ఖరారు చేశారు. రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 102 మంది బరిలో నిలిచారు. వరంగల్ తూర్పు నియోజవర్గ బరిలో 29 మంది ఉన్నారు. కేవలం ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. రాజనాల శ్రీహరి, ఆడెపు నగేశ్ విత్డ్రా చేసుకున్నారు. కాగా, తూర్పులో 29 మంది బరిలో నిలువడంతో రెండు ఈవీఎంల వినియోగం తప్పనిసరిగా మారింది.
నన్నపునేని నరేందర్, ఎర్రబెల్లి ప్రదీప్రావు, కొండా సురేఖ, చిత్రపు పుష్పితలయ, కమకర్ ఇజ్జగిరి, జగదీశ్వర్ సుంచు, పనికెల శ్రీనివాస్, వావిలాల రాజేందర్, కేడల ప్రసాద్, కౌటం రవీందర్, కె.రవి, ప్రమీల జన్ను, సండ్ర జాన్సన్, రంగరాజు రవీందర్, బోళ్ల రామకృష్ణ, పల్లకొండ మల్లేశ్వరి, ప్రభభాను లక్ష్మణ్, ఎదులాపురం కార్తీక్, పోలెపాక చంద్రకళ, లింగమూర్తి తోట, అనిల్ చింతల, భవంతుల రాధిక, సండ్ర ప్రదీప్, శ్వేత జోగు, కుడికాల రాధాకిషన్, వన్నాల శ్రీనివాస్, పరంజ్యోతి జన్ను, శ్రీకాంత్ పూసల, కమ్లికార్ రంజిత్కుమార్ ఎన్నికల బరిలో నిలిచారు.
హనుమకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఐదుగురు అభ్యర్థులు నామినినేషన్లను ఉప సంహరించుకోగా, 15 మంది బరిలో నిలిచినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, హనుమకొండ ఆర్డీవో ఎల్.రమేశ్ తెలిపారు. బీఆర్ఎస్ నుంచి దాస్యం వినయ్భాస్కర్, కాంగ్రెస్ నుంచి నాయిని రాజేందర్రెడ్డి, బీఎస్పీ నుంచి మాదారపు రవికుమార్, బీజేపీ నుంచి రావు పద్మ, తెలంగాణ ద్రావిడ ప్రజల పార్టీ నుంచి ఐలాపురం వేణుచారి, ధర్మసమాజ్ పార్టీ నుంచి కొగిల రూప, మార్యూస్ట్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్) నుంచి గడ్డం నాగార్జున, అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్ ఫార్టీ నుంచి గట్ల యుగేంధర్, అజాద్ సమాజ్ పార్టీ నుంచి సయ్యద్ షాజిహషీర్, స్వతంత్ర అభ్యర్థులు మహ్మద్ ఖలీలొద్దిన్, కుందూరు కృష్ణ, గుజ్జుల శ్రీనివాస్రెడ్డి, గుర్రం జక్కయ్య, బొమ్మగాని భార్గవ్, పూసల సత్యప్రకాశ్ బరిలో ఉన్నారు. నామినేషన్లు ఉప సంహరించుకున్న వారిలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బాక్ జంగా రాఘవరెడ్డి, స్వతంత్ర అభ్యర్థులు ఇమ్మడి రవి, ఉల్లెంగుల యాదగిరి, జన్ను మధు, బహుజన్ రిపబ్లికన్ సోషలిస్టు పార్టీ సీతా రాజ్కుమర్ ఉన్నారు.
వర్ధన్నపేట: వర్ధన్నపేట శాసనసభ స్థానానికి 14 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే తెలిపారు. ఆరుగురు సభ్యులు విత్డ్రా చేసుకున్నట్లు పేర్కొన్నారు. శ్రీమతి అరూరి నిర్మల, ఇసంపెల్లి వేణు, ఇల్లందుల శోభన్బాబు, జోగు శ్యామ్, తాటికాల సతీశ్, ఐత ప్రవీణ్ ఉపసంహరించుకున్న వారిలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్, కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్.నాగరాజు, బీజేపీ అభ్యర్థి కొండేటి శ్రీధర్తోపాటు 11 మంది బరిలో నిలిచారు.
పరకాల: వచ్చే ఎన్నికల్లో పరకాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 41 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా, ఐదు తిరస్కరణకు గురయ్యాయి. 8 మంది అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. దీంతో 28 మంది బరిలో నిలిచారు. చల్లా జ్యోతి, బండి శంకర్, ఉప్పల శ్రీనివాస్, సోల్తి కిరణ్కుమార్గౌడ్, బానోత్ అనిల్కుమార్, పి.భాగ్యశ్రీ, పి.డేవిడ్ రాజ్, ఉల్లెంగల అశోక్ పవన్ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. చల్లా ధర్మారెడ్డి(బీఆర్ఎస్), పగడాల కాళీప్రసాద్రావు(బీజేపీ), రేవూరి ప్రకాశ్రెడ్డి(కాంగ్రెస్), ఆముదాలపల్లి మల్ల్లేశం(బీఎస్పీ), రిజిస్టర్డ్ రాజకీయ పార్టీల నుంచి అబ్బాడి బుచ్చిరెడ్డి, కుమారస్వామి గోనె, దేవరాజు పెండల, దొంతుల శ్రావణ్, పూరెళ్ల రమేశ్, యువరాజు సంగెకారి, రమేశ్బాబు శనిగరపు, స్వతంత్ర అభ్యర్థులుగా అర్షం అశోక్, అందె కుమారస్వామి, కృపాకర్ బొచ్చు, కొలగాని సురేశ్, గజ్జి విష్ణు, గణిపాక కోర్నెల్, గుండా రాము, గోనె రాజు, చిమ్మని దేవరాజ్, నల్లెల్ల సతీశ్, ప్రసాద్ సంఘి, పెండ్లి జనార్దన్, పెండెల కుమారస్వామి, బొల్లు రాజిరెడ్డి, బూర్గుల రాంచందర్రావు, ఏ రవీందర్, టి.రామ్మూర్తి బరిలో ఉన్నారు. అనంతరం రిటర్నింగ్ అధికారి కె.శ్రీనివాస్ బరిలో నిలిచిన అభ్యర్థులతో సమావేశమై గుర్తులు కేటాయించారు.
నర్సంపేట: నర్సంపేట నియోజకవర్గంలో 16 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. ముస్కె అమర్, నూనె అనిల్కుమార్, గడ్డం ఆంజనేయులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మొత్తం 24 మంది నామినేషనన్లు వేయగా ఐదింటిని తిరస్కరించారు. మిగిలిన 19 నామినేషన్లలో ముగ్గురు విత్డ్రా చేసుకోగా, 16 మంది ఎన్నికల బరిలో నిలిచారు. బీఆర్ఎస్ నుంచి పెద్ది సుదర్శన్రెడ్డి, కాంగ్రెస్ నుంచి దొంతి మాధవరెడ్డి, బీజేపీ నుంచి డాక్టర్ కంభంపాటి పుల్లారావు, బీఎస్పీ నుంచి గుండాల మదన్కుమార్, ఆరెల్లి లలిత, గోనె యువరాజు, బానోత్ శ్రీనివాస్, గుండెబోయిన రమేశ్, పెద్దారపు రమేశ్, ఉండ్రాతి వీరస్వామి, ఇమ్మడి చిన్నికృష్ణ, డాక్టర్ పెంచాల శ్రీనివాస్, మొగిలి ప్రతాపరెడ్డి, బానోత్ ప్రేమ్లాల్, భూషబోయిన సురేశ్, మొగిలిచర్ల సందీప్ ఎన్నికల బరిలో ఉన్నారు.