బయ్యారం, ఆగస్టు 29: సర్కారు దవాఖానల మందుల్లేవ్.. పరీక్షల్లేవ్.. ప్రైవేటుకు పోక ఏం చేయమంటరు? చావమంటరా? అంటూ మహబూబాబాద్ జిల్లా వైద్యాధికారి మురళీధర్ను గ్రామస్తులు ప్రశ్నించా రు. బయ్యారం మండల కేంద్రంలోని శ్రీరామ, ప్రశాంతి క్లినిక్లు, ల్యాబ్లను గురువారం ఆయన తనిఖీ చేశారు. సరైన అనుమతులు లేవని, పరిమితికి మించి వైద్యం చేస్తున్నారని వాటిని మూసివేయాలని నిర్వాహకులను ఆదేశించారు.
ఈ క్ర మంలో విష జ్వరాలతో వైద్యం చేయించుకునేందుకు అక్కడకు వచ్చిన ప్రజలు వైద్య శాఖ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బయ్యారం, గంధంపల్లి వైద్యశాలల్లో ల్యాబ్ టెక్నీషియన్లు లేరని, పరీక్షల కోసం రక్త నమూనాలు ఇస్తే రిపోర్ట్ వచ్చేందుకు వారం రోజులు పడుతున్నదని, దీంతో ప్రాణాల మీదకు తెచ్చుకోవాల్సి వస్తున్నదని అన్నా రు.
పల్లె దవాఖానల్లో సైతం సరైన మందు లు, సిబ్బంది లేకపోవడంతోనే మండల కేంద్రాల్లోని ఆస్పత్రులకు వస్తున్నామన్నా రు. ప్రభుత్వ దవాఖానల్లో సేవలు మెరుగు పరిచి ప్రైవేటుకు పోకుండా కట్టడి చేయాలన్నారు. డీఎంహెచ్వో వెంట సిబ్బంది శ్రీనివాస్, రామారావు తదితరులున్నారు.