పాలకుర్తి రూరల్, ఏప్రిల్ 10: కరెంట్ అంటే ఏంటో తెలియని పసి వయస్సులో శక్తి కి మించి ఆలోచించి విద్యుదాఘాతం నుంచి తన తమ్ముడిని కాపాడింది ఓ సాహస బాలిక. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండ లం చెన్నూరు గ్రామంలో బుధవారం వెలుగు లోకి వచ్చింది. అరకల స్రవంతి-రాము దంప తులకు ఇద్దరు సంతానం. కుమార్తె మధుప్రి య(10) 5వ తరగతి, కుమారుడు మణివ ర్ధన్(6) యూకేజీ చదువుతున్నారు. ఉగాది పర్వదినమైన మంగళవారం బకెట్లో వాటర్ హీటర్ వేసి తల్లిదండ్రులు ఇంటి బయటికి వెళ్లారు. మణివర్ధన్ ఆడుకుంటూ వచ్చి హీట ర్ను ముట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై గట్టిగా అరిచాడు. వెంటనే అక్క మధుప్రియ అక్కడికి వచ్చి కరెంట్ ఫ్లగ్ తీయడానికి ప్రయత్నించింది. అది రాకపోయే సరికి చాకచక్యంగా హీటర్ కనెక్షన్ ఉన్న తీగను చేతి చుట్టూ చుట్టుకుని గట్టిగా లాగి ఇంటి బయట పడేసి తమ్ముడి ప్రాణాలను కాపాడింది. జరిగిన విషయం చెప్పడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. బాలిక మధుప్రియను గ్రామస్తులతో పాటు విషయం తెలుసు కున్న మహాత్మా హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకుడు గంట రవీందర్, వందేమా తరం ఫౌండేషన్ ప్రతినిధి తక్కళ్లపల్లి రవీందర్రావు అభినందించారు.