రాయపర్తి, డిసెంబర్ 4: సమాజంలోని ప్రజలందరి మధ్య సోదరభావాన్ని పెంపొందించడంతోపాటు ప్రపంచ శాంతికి ఇస్లాం మత పవిత్ర గ్రంథం ఖురాన్ బోధనలు ఎంతగానో దోహదం చేస్తున్నాయని ఇస్లాం మత గురువులు ముఫ్తీలు మొహీనొద్దీన్, రఫీక్, యూసుఫ్, జాకీర్ అన్నారు. మండలకేంద్రంలోని మసీద్-ఏ-నూర్ ఆవరణలో ఆదివారం మండలస్థాయి ఇస్లాం ధార్మిక సదస్సు (ఇస్తేమా) నిర్వహించారు.
వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ ఖురాన్ ప్రజలకు సన్మార్గాలు సూచిస్తూ పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. మానవులంతా తమ జీవిత కాలంలో తప్పనిసరిగా ఆధ్యాత్మికతను అలవాటు చేసుకోవాలని కోరారు. అనంతరం ముస్లింలు సామూహిక నమాజ్ చేశారు. ఇస్తేమాలో మండలంలోని రాయపర్తి, కొత్త రాయపర్తి, కొండాపురం, తిర్మలాయపల్లి, కాట్రపల్లి, పెర్కవేడు, కొత్తూరు, గన్నారం, బంధన్పల్లి, మైలారం, ఊకల్కు చెందిన ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మసీద్-ఏ-నూర్ సదర్సాహెబ్ మహ్మద్ లాయఖ్అలీ, ఇమామ్ అమీర్ హుస్సేన్, మతపెద్దలు మహ్మద్ అస్గర్ అలీ, అమ్జద్పాషా, రఫీక్, అబ్దుల్ ఘనీ, షకీల్, చాంద్పాషా, ఉస్మాన్, షరీఫ్, బాషామియా, అక్బర్, గుంషావళి, షబ్బీర్, యాసిన్, ఖాసీం, మహిమూద్ పాల్గొన్నారు.