ఆత్మకూరు, మార్చి 24 : గూడెప్పాడ్ స్టేజీ వద్ద ఆదివారం ఓ వ్యక్తి తన భార్యతో గొడవ పడి గ్యాస్ లీక్ చేయడంతో ఇల్లు దగ్ధమైంది. స్థానికుల కథనం ప్రకారం.. గూడెప్పాడ్కు చెందిన మహ్మద్ అక్తర్ పాషాకు తన భార్య నసీమాతో రెండు రోజుల క్రితం గొడవ జరిగింది. ఇద్దరు పిల్లలతో కలిసి నసీమా తన తల్లిగారింటికి వెళ్లింది. దీంతో కోపంతో అక్తర్ ఇంట్లో ఉన్న వంట గ్యాస్ లీక్ చేసి బయటకు వెళ్లి పోయాడు. కాసేపటికి మంటలు చెలరేగి ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులు, ఫ్రిడ్జ్, పూర్తిగా కాలిపోయాయి. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి తెలుపగా, ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.