ఖిలావరంగల్, ఫిబ్రవరి 25 : చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోటలో శనివారం విదేశీయులు సందడి చేశారు. బెల్జియం దేశానికి చెందిన 30 మంది కోటను సందర్శించారు. చారిత్రక నిర్మాణాలు, కాకతీయుల కట్టడాలు, శిల్పాల విశిష్టతను అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్యకిరణ్ వివరించారు.
రామప్పకు పోటెత్తిన భక్తులు..
వెంకటాపూర్ : మండలంలోని రామప్ప దేవాలయం విద్యార్థులు, పర్యాటకులు, భక్తులతో కిక్కిరిసిపోయింది. సుమారు 10 వేల మంది సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. వండర్ టెంపుల్ రామప్ప అని అమెరికాకు చెందిన సూ ఉరే, జోనాథన్ ఓస్లాన్ అన్నారు. రామప్ప ప్రాముఖ్యతను వారు స్టేట్ గైడ్ కుమార్ ద్వారా తెలుసుకొని మాట్లాడుతూ ఆర్కిటెక్చర్ వండర్ఫుల్గా ఉందన్నారు. దేవాలయంలను బెల్జియం దేశస్తులు సందర్శించారు. రామప్ప శిల్పాలు, ఇంజినీరింగ్ టెక్నాలజీ అద్భుతమన్నారు. భారతీయ సంస్కృతీసంప్రదాయాలు, సనాతన ధర్మం గొప్పదని చెప్పారు. అనంతరం ఆలయం బయట షాపుల్లో గాజులను కొనుగోలు చేశారు.