పలిమెల, మార్చి 27 : పలిమెల రేంజ్ పరిధిలోని అడవి అగ్నికి ఆహుతవుతున్నది. లెంకలగడ్డ బండలవాగు – పంకె న రామ్లక్ష్మణ్ చెట్ల వరకు అడవిలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో అడవి మొత్తం మంటలు వ్యాపించాయి. రెండు, మూడు రోజులుగా దగ్ధమవుతున్నా మంటలను అదుపు చేసేందుకు అటవీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పంకెన ఫారెస్ట్ కాంప్లెక్స్కు కూతవేటు దూరంలోనే మంటలు ఉన్నా పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంటల్లో విలువైన వృక్ష సంపదతో పాటు వన్యప్రాణులకు హాని కలిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్ని ప్రమాదాలు జరుగకుండా వాటి నివారణకు ప్రభుత్వం ఫైర్లైన్స్, గస్తీ బృందాలను ఏర్పాటు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. అటవీ గ్రామాల్లో ఎరగడి మంటలపై ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.