గిర్మాజీపేట, మే 10 : పది ఫలితాల్లో పాపయ్యపేట చమన్లోని మాంటిస్సోరి ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు కరస్పాండెంట్ లలితా నర్సింహారెడ్డి తెలిపారు. విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు.
ఏ రేవంత్రెడ్డి 10/10 జీపీఏ సాధించగా, డీ అభిరామ్, సీహెచ్ కల్యాణి, ఆర్ పూజ 9.8 జీపీఏ, వీ ప్రణవి 9.7 జీపీఏ, ఆర్ అహల్య, ఎం సునయ 9.5 జీపీఏ, ఎన్ అనేశ్వర్, సీహెచ్ శ్రావణి 9.3 జీపీఏ, యూ సంపత్ 9.2 జీపీఏ, వీ జశ్వంత్, సీహెచ్ కార్తీక్ 9.0 జీపీఏ సాధించినట్లు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు.