వరంగల్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలపై దాడులు మొదలయ్యాయని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. అగ్రంపహాడ్ జాతర వద్ద ఎలాంటి ఘర్షణ జరగకపోయినా పోలీసులు బీఆర్ఎస్ వాళ్లను ఇష్టమొచ్చినట్లు కొట్టారని అన్నారు. పోలీసు కానిస్టేబుల్తో కేసు పెట్టించి హనుమకొండలోని టాస్క్ఫోర్స్ ఆఫీసులో 12 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని చెప్పారు. బీఆర్ఎస్ వాళ్లను కొట్టిన ఆత్మకూరు ఎస్సై ప్రసాద్ను వెంటనే సస్పెండ్ చేయాలని, సమగ్ర విచారణ జరిపి ఏసీపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ హామీ ఇచ్చిన ప్రకారం 24 గంటల్లో ఎస్సైపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే బీఆర్ఎస్ తరఫున తీవ్ర స్పందన ఉంటుందన్నారు. గడువులోపు చర్యలు తీసుకోకుంటే మంగళవారం ‘చలో ఆత్మకూరు’ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఆత్మకూరు పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఆదివారం హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆత్మకూరు పోలీసులు కొట్టడంతో గాయాలైన బాధితులు, బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్, పరకాల మా12 మంది బీఆర్ఎస్
నాయకులపై పోలీసుల ప్రతాపం
పహాడ్ జాతర నిర్వహణ కోసం అనేక అభివృద్ధి పనులు చేసిన చల్లా ధర్మారెడ్డి ముందుగా పరకాల ఏసీపీ, ఆలయ ఈవోకు సమాచారం ఇచ్చి ఈనెల 23న దర్శనానికి వెళ్లారు. ధర్మారెడ్డి అక్కడికి వెళ్లే సమయానికి గేట్లు బంద్ పెట్టారు. ఈవో, ఇతర అధికారులు అందుబాటులో లేకుండా పోయా రు. అక్కడికి భారీగా చేరిన భక్తులు, బీఆర్ఎస్ కార్యకర్తలు కొందరు… జై చల్లా, జై తెలంగాణ అని నినాదాలు చేశారు. దీంతో గేట్లు తీసిన తర్వాత దర్శనం చేసుకుని వచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఎలాంటి వాదులాట సైతం జరగలేదు. కొట్లాట, ఘర్షణ అసలే లేదు.
ఏమైందో తెలియదు. ఎవరి రాజకీయ ఒత్తిడి కారణమో గానీ, జాతర వద్ద డ్యూటీలో ఉన్న తనను తోసుకుంటూ వెళ్లారని ఆరోపిస్తూ అదే రోజు రాత్రి ఆత్మకూరు పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్తో ఫిర్యాదు చేయించారు. ఐపీసీలోని 143, 149, 353 సెక్షన్లతో 12 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కేసు పెట్టారు. అవన్నీ స్థానిక పోలీసు స్టేషన్లో బెయిల్ ఇచ్చే సెక్షన్లే. ఆదివారం కావడంతో వాళ్లు సోమవారం పోలీస్స్టేషన్కు వెళ్దామని అనుకున్నారు. ఏసీపీ కిశోర్, సీఐ సంతోష్ ఆదేశాలతో ఎస్సై ప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం అర్ధరాత్రి ఆత్మకూరు పోలీసులు 12 మందిని నేరగాండ్ల తరహాలో హనుమకొండలోని టాస్క్ఫోర్స్ ఆఫీసుకు తీసుకెళ్లారు.
అక్కడ డ్రాయర్ మాత్రమే ఉండేలా అందరితో బట్టలు విప్పించారు. ఒక్కొక్కరిని లోపలికి తీసుకుపోయి బట్టలు లేకుండా ఇష్టం వచ్చినట్లు కొట్టారు. ఐదారుసార్లు ఇలా ఒ క్కొక్కరిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. రోకలుబండలు ఎక్కించారు. పిరుదులపై బెల్టులతో కొట్టారు. 70 ఏండ్లు దాటిన, ఆరోగ్యం బాగాలేని వారిపై కనీసం కరుణ చూపలేదు. ఎస్సై అశోక్ లోపలి నుంచి బయటికి వచ్చి… అరేయ్ ఫోన్ వచ్చిందిరా, నీపేరే వచ్చింది రారా.. అంటూ ఒక్కొక్కరిని లోపలికి తీసుకుపోయి కొట్టాడు. పోలీసుల దుశ్చర్యపై ఆదివారం ఉదయం వరంగల్ పోలీసు కమిషనర్ను కలిసి వివరించాం. కేసు, విచారణ చట్ట ప్రకారం ఉంటాయని, పో లీసులు కొట్టే పరిస్థితి ఉండదని, అలాంటిది జరిగితే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అరెస్టయిన వాళ్లను బెయిల్పై తీసుకెళ్లవచ్చని ఈస్ట్ జోన్ డీసీపీ చెప్పారు.
ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆత్మకూరు స్టేషన్లో బెయిల్ తీసుకుని వచ్చారు. బయటికి వెళ్లి ఇక్కడ జరిగింది చెబితే ఇంకా దారుణంగా ఉంటుందని పోలీసులు బీఆర్ఎస్ వాళ్లను బెదిరించారు. స్టేషన్ నుంచి వచ్చిన వారు మమ్మల్ని కలిసి జరిగింది వివరించారు. అందరినీ తీసుకుపోయి మళ్లీ వరంగల్ పోలీసు కమిషనర్ను కలిసి వివరించాం. కొట్టడం ఎవరు చేసినా తప్పే నని, ఆయన చెప్పిన విషయం గుర్తుచేశాం. ఎస్సై ని వెంటనే సస్పెండ్ చేయాలని, విచారణ జరిపి ఏసీపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాం. వరంగల్ పోలీసు కమిషనర్కు 24 గంటల గడువు ఇస్తున్నాం.
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అన్యాయంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోకపోతే తీవ్రమైన స్పందన ఉంటుంది. వరంగల్ పోలీసు కమిషనర్ తగిన చర్య లు తీసుకోకుంటే హైకోర్టుకు, మానవ హక్కుల కమిషన్కు వెళ్తాం. ఈ నెల 27న చలో ఆత్మకూరు నిర్వహిస్తాం. హను మకొండ నుంచి భారీగా తరలివెళ్లి ఆత్మకూరు పోలీసుస్టేషన్ ఎదుట కూర్చుంటాం. పోలీసులు రాజకీయ ప్రేరేపితంగా బీఆర్ఎస్ వాళ్లను కొట్టారు. అన్యాయంగా కొట్టిన, కొట్టించిన ఎస్సై, ఏసీపీపై వెంటనే చర్యలు తీసుకోవాలి. సమగ్రమైన విచారణ జరిపి రాజకీయంగా ఒత్తిడి తెచ్చిన వాళ్ల నిగ్గు తేల్చాలి’ అని కడియం అన్నారు.
అగ్రంపహాడ్ జాతర వద్ద బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ వాళ్లకు మధ్య ఎలాంటి వాదులాట జరగలేదని, పోలీసులతోనూ ఎవరూ తప్పుగా వ్యవహరించలేదని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. అక్కడ సరిగ్గా ఏం జరిగిందనేది సీసీ కెమెరాలను పరిశీలిస్తే తెలుస్తుందని, వాస్తవాలను ప్రజలకు చూపెట్టాలన్నారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చిన రాజకీయ నాయకులు ఎవరో అందరికీ తెలియాలని డిమాండ్ చేశారు. ఆత్మకూరు పోలీసుస్టేషన్లో కేసు నమోదై న వారిని హనుమకొండలోని టాస్క్ఫోర్స్ ఆఫీసుకు ఎందు కు తీసుకువచ్చారో పోలీసులు వివరణ ఇవ్వాలన్నారు. టా స్క్ఫోర్స్ ఆఫీసుల ఆ విభాగం ఏసీసీ, ఇన్స్పెక్టర్లు, సిబ్బంది లేనప్పుడు.. పరకాల, ఆత్మకూరు పోలీసు అధికారులు బీఆ ర్ఎస్ వాళ్లను ఇష్టం వచ్చినట్లుగా కొట్టారని వివరించారు.