నల్లబెల్లి, డిసెంబర్ 3 : తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ విద్యావంతులు వేదిక జిల్లా కన్వీనర్ బట్టు సాంబయ్య మాట్లాడుతూ.. ఎందరో అమరుల త్యాగాల పలితమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమని చెప్పారు. కార్యక్రమంలో ఉద్యమకారులు పరికి కొర్నేల్, గంగిశెట్టి శ్రీనివాస్గుప్తా, సట్ల శ్రీనివాస్గౌడ్, కార్యదర్శి ధర్మేందర్, గుండెబోయిన ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట రూరల్ : నర్సంపేటలో విశ్వకర్మ పట్టణ అధ్యక్షుడు దేవోజు సదానందం ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ జాతిలో చైతన్యం రగిలించడానికి ఆత్మబలిదానం చేసుకున్న మలిదశ ఉద్యమ తొలి అమర వీరుడు శ్రీకాంతాచారి అని గుర్తు చేశారు. కార్యక్రమంలో శ్రీరామోజు లక్ష్మీపతి, కాసోజుల బ్రహ్మచారి, శ్రీరామోజు జయకుమార్, కల్వచర్ల సాంబయ్య, గుటోజు కృష్ణమూర్తి, కుమారస్వామి, దేవేందర్, రవీంద్రాచారి, వీరాచారి, మురళి, హేమంత్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
రాయపర్తి : తెలంగాణ మలి దశ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి ఆశయ సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు మహ్మద్ నయీం తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో చారి చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొండూరు గ్రామంలో విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు అబ్బోజు యాకస్వామి సారధ్యంలో సర్పంచ్ కర్ర సరిత శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో టీఆర్ఎస్ నాయకులు పోల్నేని శ్యాంరావు, ఎనగందుల శ్యాంరావు, గుమ్మడవెల్లి శ్రీనివాస్, చిన్నాల యాకయ్య, నారగోని శ్యాం ప్రసాద్, మచ్చ రాములు, నర్సింహరాములు, కొమ్ము రాజు, దేశబోయిన ఉపేందర్, వీరమనేని సత్యనారాయణరావు, పులి సోమయ్యగౌడ్, ఆవుల కేశవరెడ్డి, నేరెల్లి రాములు, సోమేశ్వర్రావు, గుగులోత్ సోమన్న, నేరెల్లి మహేశ్, రాచకొండ రమణాచారి, బ్రహ్మచారి, సత్తయ్యచారి తదితరులు పాల్గొన్నారు.