రేగొండ, నవంబర్ 23 : పోరాడి సాధించుకున్న తెలంగాణలో రైతురాజ్య స్థాపనే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో మండలంలోని రంగయ్యపల్లె, రేపాక, భాగిర్ధిపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గండ్ర బుధవారం ప్రారంభంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆరుకాలం కష్ట పండించిన పంట అమ్ముకునే సమయంలో దళారులను నమ్మి మోసపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయనని చేతులు దులుపుకున్నా, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని తెలిపారు.
రైతును రాజుగా మార్చేందుకు ప్రాజెక్టుల నిర్మాణం, చెరువులు, కుంటల మర్మతులు, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, రుణాలు, రైతు బంధు వంటి పథకాలు అమలు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అని కొనియాడారు. ఎవరెన్ని విమర్శలుచేసినా ప్రజలు టీఆర్ఎస్కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నడిపెల్లి విజ్జన్రావు, ఎంపీపీ పున్నం లక్ష్మీరవి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు మోడెం ఉమేశ్గౌడ్, కే రాజేశ్వర్రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంకం రాజేందర్, యూత్ అధ్యక్షుడు పేరాల ప్రశాంత్రావు, సర్పంచులు నడిపెల్లి శ్రీనివాసరావు, కుసుంభ రంజిత్, దగ్గు సంధ్య, పోనుగంటి తిరుపతి, నారాయణరెడ్డి, పోరెడ్డి రమణారెడ్డి, పబ్బ శ్రీనివాస్, ఎంపీటీసీ కేసిరెడ్డి ప్రతాప్రెడ్డి, నాయకులు మాదాటి కర్ణాకర్రెడ్డి, మైస భిక్షపతి, గంజి రజినీకాంత్, నీలాంబరం, మహేందర్ గౌడ్, సామ్రాట్ రవి పాల్గొన్నారు.
సమన్వయంతో పనిచేయాలి
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే మండలం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే గండ్ర అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పున్నం లక్ష్మీరవి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు అధికారుల నిర్లక్ష్యంపై సభలో నిలదీశారు. విద్యుత్, ఐసీడీఎస్, ఆర్డబ్ల్యూఎస్, వాటర్గ్రిడ్, విద్య, వైద్యశాఖ ఆధికారుల తీరులో మార్పు రావడం లేదని, ప్రజా ప్రతినిధులపై గౌరవం లేదని, తమకు సంబంధం లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సర్పంచులు ఏడునూతుల నిషీధర్రెడ్డి, దాసరి నారాయణరెడ్డి, లింగంపల్లి ప్రసాద్రావు, అంబల చందు, దగ్గు సంధ్య, లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికైన ఆధికారులు తీరు మార్చుకోవాలని హితవు పలికారు. లేనిపక్షంలో శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఎంపీడీవో సురేందర్గౌడ్, తహసీల్దార్ షరీఫ్, పీఏసీఎస్ చైర్మన్ నడిపెల్లి విజ్జన్రావు, పశువైద్యాధికారులు మైథిలి, శ్రీకాంత్రెడ్డి, వ్యవసాయశాఖ అధికారి వాసుదేవారెడ్డి, సర్పంచులు శ్రీనివాసరావు, రంజిత్, నీల, పాతపెల్లి సంతోష్ పాల్గొన్నారు.