గిర్మాజీపేట, ఏప్రిల్ 12: ఇంతేజార్గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలో గుట్కాలను నిల్వ చేసిన ఓ ఇంటిపై టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం దాడి చేశారు. టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ వైభవ్ఘ్రునాథ్గైక్వాడ్ కథనం వివరాల ప్రకారం.. పోలీస్స్టేషన్ పరిధిలోని చార్బౌళి ప్రాంతానికి చెందిన ఎండీ ఐద్రీస్అలీ ఇంట్లో గుట్కాలు నిల్వ ఉంచినట్లు సమాచారం మేరకు దాడి చేసినట్లు తెలిపారు. రూ.1.25లక్షల గుట్కాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఐద్రీస్అలీతోపాటు ఆటోడ్రైవర్ చల్లా రాజును అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. పట్టుబడిన వారిని విచారణ కోసం స్థానిక పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్లు సీహెచ్ శ్రీనివాస్జీ, ఆర్ సంతోష్, సిబ్బంది పాల్గొన్నారు.