హనుమకొండ చౌరస్తా : ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసంనిర్వహిస్తున్న సమ్మెకు ( RTC Strike ) కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ( Student JAC ) సంఘీభావం తెలిపింది. కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చర్చలు జరిపి సమ్మెను విరమింపచేయాలని జేఏసీ చైర్మన్ డి.తిరుపతి డిమాండ్ చేశారు. శుక్రవారం కేయూలో జరిగిన జేఏసీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు .
ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఉద్యోగాల భర్తీ, కార్మికుల బకాయిల చెల్లింపు, కార్మిక సంఘం ఎన్నికలు, ఔట్సోర్సింగ్ కార్మికుల రెగ్యులరైజ్ హామీ లను విస్మరిస్తుందని ఆరోపించారు.
అద్దె బస్సుల ముసుగులో సంస్థను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఎలక్ట్రిసిటీ బస్సులు ప్రైవేటు వ్యక్తుల ద్వారా కొనుగోలు చేసి నడువుతున్నదని విమర్శించారు. సమావేశంలో విద్యార్థి జేఏసీ సీనియర్ నాయకుడు కలకోట్ల సుమన్, కన్వీనర్ కందికొండ తిరుపతి, కార్యదర్శి జనగాం రాజారాం, నాయకులు బొక్క ప్రవర్ధన్, రోనాల్డ్, అశోక్, నరేష్, కుమార్, అనిల్ పాల్గొన్నారు.