మడికొండ, నవంబర్ 22 : ప్రతి విద్యార్థి సైన్స్పై అవగాహన పెంచుకోవాలని నిట్ విశ్రాంత ప్రొఫెసర్ రామచంద్రయ్య సూచించారు. కడిపికొండ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం జన విజ్ఞాన వేదిక అధ్యక్ష, కార్యదర్శులు ప్రొఫెసర్ హరిప్రసాద్, పాల కుమారస్వామి ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. హెచ్ఎం మనోజ్కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో రామచంద్రయ్య మాట్లాడుతూ మన ఆలోచనలు పర్యావరణ పరిరక్షణ కోసం ఉండాలని, మూఢనమ్మకాలపై దృష్టి పెట్టవద్దన్నారు. కాగా, ఈ టెస్ట్లో ప్రభుత్వ పాఠశాలల నుంచి మడికొండ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హైసూల్ ప్రథమ స్థానం, ఫాతిమా గర్ల్స్ హైసూల్ ద్వితీయ స్థానంలో నిలిచాయి. ప్రైవేట్ సూల్స్ నుంచి సెయింట్ గాబ్రియేల్ హైసూల్ ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచింది. ్ర కార్యక్రమంలో రాజగోపాలాచారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
హసన్పర్తి పాఠశాలలో..
హసన్పర్తి : జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో హసన్పర్తి జడ్పీహెచ్ఎస్లో హెచ్ఎం కుమార్ అధ్యక్షతన మంగళవారం మండల స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ను నిర్వహించారు. జేవీవీ మండల కన్వీనర్ షేక్ గౌస్పాషా, జిల్లా సైన్స్ ఆఫీసర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చెకుముఖి కన్వీనర్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రభాకరాచారి పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు సైన్స్ సాంకేతిక విషయాలపై అవగాహన కల్పించేందుకు ఏటా టాలెంట్ టెస్ట్లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీలో 30 పాఠశాలలకు చెందిన 90 మంది విద్యార్థులు పాల్గొన్నారు. షైన్ స్కూల్, సిద్ధాపూర్, చింతగట్టు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కార్యక్రమంలో జేవీవీ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ధర్మసాగర్లో..
ధర్మసాగర్ : మండల కేంద్రంలోని జడ్పీఎస్ఎస్(బాలుర)లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. తెలుగు మీడియం నుంచి 17, ఇంగ్లిష్ మీడియం నుంచి 18 పాఠశాలల నుంచి విద్యార్థులు పరీక్షలు రాసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 27న జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
వేలేరులో..
వేలేరు : వేలేరు బాలుర గురుకుల పాఠశాలలో జేవీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి టాలెంట్ టెస్ట్లో విజేతలైన విద్యార్థులకు ఎస్సై కె నవీన్కుమార్ బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రౌతు అజయ్కుమార్, ఏఎస్సై భీమ్రెడ్డి, జేవీవీ నాయకుడు తిరుపతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.