గీసుగొండ, నవంబర్ 23 : చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందిన ఘటన గీసుగొండలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. యూసుఫ్బాబా (17) గీసుగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు.
కొంతకాలంగా కడుపు నొప్పి తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో కడుపునొప్పి భరించలేక ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు ఎంజీఎం దవా ఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.