హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 8 : హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తెలంగాణ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అండర్-15 పోటీల్లో ఓవరాల్ చాంపియన్షిప్ను 87 పాయింట్లతో వరంగల్ జట్టు కైవసం చేసుకుంది. రన్నరప్గా హై దరాబాద్, తృతీయ స్థానం లో సంగారెడ్డి నిలిచింది.
బాలికల అండర్-15.. 33 కేజీల విభాగంలో ములుగు జిల్లాకు చెందిన రాజేశ్వరి 3వ స్థానం, 36 కేజీల విభాగంలో 3వ స్థానంలో వర్ష (వరంగల్), తృతీయ స్థానం అంజ లి, 39 కేజీల విభాగంలో వరంగల్కు చెందిన మీనాక్షికి ప్రథమ స్థానం, భూపాలపల్లికి చెందిన నిహారిక 3వ స్థానం, 42 కేజీల్లో 3వ స్థానంలో పీ సుష్మా (వరంగల్), కే అక్షయ (ములుగు), 46 కేజీల్లో ము లుగుకు చెందిన అశ్విని 3వ స్థానం, 50 కేజీల్లో వరంగల్కు చెందిన మానసకు మూడో స్థానం, 54 కేజీల్లో 2వ స్థానం సమీర (వరంగల్), 58 కేజీల్లో 2వ స్థానం కృతిక (భూపాలపల్లి), ములుగుకు చెంది న రష్మిత మూడో స్థానంలో నిలిచింది. అలాగే 62 కేజీల్లో 3వ స్థానం కే అనవిత (భూపాలపల్లి), 66 కేజీల విభాగంలో 3వ స్థానంలో జే అంజలి (వరంగల్), హనుమకొండకు చెందిన బీ అంజని నిలిచింది.
38 కేజీల విభాగంలో వెంకటేశ్(నిజామాబాద్), వరుణ్తేజ(జనగామ), 41 కేజీల్లో ఎండీ అమీర్( వరంగల్), 44 కేజీల్లో ఎం లక్ష్మణ్, 48 కేజీల్లో సింధు(ములుగు), 52 కేజీల్లో ముబిల్(వరంగల్) 57 కేజీల్లో యోగేశ్వర్, 62 కేజీల్లో నరేశ్కుమార్, 68 కేజీల్లో అభిషేక్, 75 కేజీల్లో మనీవర్దన్ (హనుమ కొండ), 85 కేజీల్లో ఎస్కే జూనియర్, (మహబూబా బాద్), సారథి, భూపాలపల్లి, విలియం కేరీ (హనుమకొండ) ప్రతిభ కనబరిచారు.
అండర్-20 రాష్ట్రస్థాయి బాలబాలికల రెజ్లింగ్ పోటీలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు. అనంతరం అండర్-15లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు. కార్యక్రమం లో హనుమకొండ జిల్లా క్రీడల అధికారి గుగులోత్ అశోక్కుమార్నాయక్, తెలంగాణ అమెచ్యూర్ రెజ్లిం గ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ కరీం, కోశాధికారి సుధాకర్, వివిధ జిల్లాల రెజ్లింగ్ సంఘాల బాధ్యులు జైపాల్, సాయిలు, శ్రీనివాస్, రాజేందర్, సతీశ్, రాజు, వంశీకృష్ణ పాల్గొన్నారు.